**బూత్ కమిటీల ఎన్నికలకు ఈ నెల 17 వరకే ఛాన్స్.*.
*సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి.*.
ప్రజా దీవెన, నల్గొండ టౌన్:ఈరోజు బిజెపి జిల్లా కార్యాలయంలో బిజెపి జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగం వర్షిత్ రెడ్డి గారి అధ్యక్షతన జిల్లా *సంస్థగత ఎన్నికల -సమీక్ష సమావేశం సంఘటన పర్వ్* నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా తెలంగాణ రాష్ట్ర సంస్థాగత ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్ తివారి గారు పాల్గొని బిజెపి పార్టీ బలోపేతానికి బూత్ కమిటీలే కీలకమని, ఈనెల 17 వరకు జిల్లాలో ఉన్న అన్ని బూత్ లలో బూత్ కమిటీల ఎన్నికలు నిర్వహించాలని జిల్లా పార్టీకి వారు తెలియజేశారు..
సంస్థాగత ఎన్నికలు నిర్వహించుకునే ప్రక్రియ భారతీయ జనతా పార్టీలోనే పారదర్శకంగా జరుగుతుంది అని కష్టపడి పని చేసే ప్రతి కార్యకర్తకు అవకాశాలు దక్కుతాయని పార్టీ బలోపేతానికి శక్తివంచన లేకుండా ప్రతి ఒక్కరు కృషి చేయాలని వారు సూచించారు.ఈనెల 17 తారీకు లోపు బూత్ కమిటీలను నియమించుకొని 22 23 తారీకు లోగా మండల అధ్యక్షులు నియామకాలు జరిగిపోవాలని ఈ నియామకాలకు జిల్లాలో ఉన్న బాధ్యులు పూర్తి సమయం ఇచ్చి క్షేత్రస్థాయిలో పరిశీలించాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి,మాజీ పార్లమెంట్ సభ్యులు బూర నర్సయ్య గౌడ్, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షులు గంగిడి మనోహర్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యదర్శి మాదగాని శ్రీనివాస్ గౌడ్, బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి, బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వీరెల్లి చంద్రశేఖర్, కన్వంత రెడ్డి శ్రీదేవి రెడ్డి, బిజెపి నాయకులు కళ్యాణ్ నాయక్, తోటపల్లి రవికుమార్ తదితరులు పాల్గొన్నారు.అదే విధంగా పాతబస్తీలో గల 28 వార్డులో బూత్ కమిటీ అధ్యక్షులుగా మహేష్ ను మరియు దాసోజు అరుణ గారిని బూత్ అధ్యక్షులుగా నియమించి 28వ వార్డులో నియామకాల సందర్భంగా సన్మానాలతో విజయోత్సవాలు జరుపుకున్నారు