CI Kondal Reddy: ప్రజా దీవెన, శాలిగౌరారం: నేటి సమాజంలో యువతీ యువకులు సత్పవర్తన కల్గివుండాలని శాలిగౌరారం సీఐ కె. కొండల్ రెడ్డి అన్నారు. పోలీస్ శాఖ ఆధ్వర్యంలో మిషన్ పరివర్తన్-యువతేజం కార్యక్రమం లో భాగంగా శాలిగౌరారం జడ్పి స్కూల్ ఆవరణలో నిర్వహించిన మండల స్థాయి కబడ్డీ పోటీలను శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి ప్రారంభించారు.
ఈ సందర్బంగా ఏర్పటైనా సమావేశం లో ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్తు యువత చేతిలో ఉందని, నేటి యువత సమాజానికి ఆదర్శంగా ఉండాలనేది పోలీస్ ల ఆశయమన్నారు. యువత క్రీడల పట్ల మక్కువ పెంచుకొని శారీరక, మానసిక ఉల్లాసం పొందాలన్నారు. ఈ కార్యక్రమం లో శాలిగౌరారం ఎస్ ఐ డి. సైదులు, ఏఎస్ఐ వెంకటయ్య, హెడ్ కానిస్టేబుళ్ళు సయ్యద్ నజీరుద్దీన్, శ్రీనివాస్, ఇంచార్జ్ హెచ్ ఎం వెంకటేశ్వర్లు, జిల్లా యూత్ కాంగ్రెస్ ఉపాధ్యక్షులు వడ్లకొండ పరమేష్ గౌడ్, మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు బొల్లికొండ గణేష్, కుంభం సందీప్, అంకిరెడ్డి రాజేష్,బండారు ధనుంజయ్,బొల్లికొండ సందీప్,పిజికల్ డైరెక్టర్లు జ్యోతి,గంగాధర అంజయ్య,బొడ్డు మల్లేష్ వివిధ గ్రామాల క్రీడాకారులు పాల్గొన్నారు