CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు స్కీం లను ఇన్సూరెన్స్ కంపెనీలకు అప్పజెప్పవద్దని బోర్డు ద్వారానే సంక్షేమ పథకాలు కార్మికులకు అమలు చేయాలని తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) (CITU) రాష్ట్ర కార్యదర్శి సిహెచ్ లక్ష్మీనా రాయణ ప్రభుత్వాన్ని కోరారు.తెలంగాణ బిల్డింగ్ అండ్ అదర్ కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఫెడరేషన్ (సిఐటియు) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో అదనపు జిల్లా కలెక్టర్ (స్థానిక సంస్థల) పూర్ణచంద్ర కు వినతి పత్రం ఇచ్చా ము. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ అనేక పోరాటాల ఫలితంగా సాధించు కున్న భవన నిర్మాణ వెల్ఫేర్ బోర్డు ను నిర్వీర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వ ఆదేశాలతో రాష్ట్ర ప్రభుత్వం వెల్ఫేర్ బోర్డు (Welfare Board) ద్వారా అమల వుతున్న ప్రమాద బీమా,సహజ మరణం,శాశ్వత పాక్షిక అంగవైక ల్యం తదితర సంక్షేమ పథకాలను భీమా కంపెనీలకు టెండర్ల ద్వారా అప్ప జెప్పాలని ఆలోచన చేస్తుందని ఇది విరమించుకో కపోతే కార్మిక వర్గ ఆగ్రహానికి ప్రభుత్వం గురికావాల్సి వస్తుందని హెచ్చరించారు. కార్మికు లకు అమలు చేస్తున్న సంక్షేమ పథ కాలను రెట్టింపు చేయాలని భవన నిర్మాణ కార్మిక సంఘాలు పోరాడు తుంటే ఉన్న వెల్ఫేర్ బోర్డు నే నిర్వీ ర్యం చేయాలని ప్రభుత్వం చూస్తుం దని ఆందోళన వ్యక్తం చేశారు.
వెల్ఫేర్ బోర్డులో ((Welfare Board)5500 కోట్ల రూపా యలు నిధులు ఉన్నాయని వాటిని కార్మికుల సంక్షేమాన్ని కాకుండా ఇష్టం వచ్చినట్లుగా దుబారా ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. చట్టం ప్రకారం వెల్ఫేర్ బోర్డు అడ్వైజరీ కమిటీ (Welfare Board Advisory Committee) అనుమతి లేకుండా బోర్డు నిధులు ఖర్చు చేయరాదని నిబం ధన ఉన్న పాటించడం లేదని ఆరోపించారు. బోర్డు ద్వారా అమలవుతున్న ఈ పథకాలను బీమా కంపెనీలకు అప్పచెప్పితే బోర్డు భవిష్యత్తు ప్రశ్నార్థకమవు తుందని సెస్సునిధులు వసూలు చేయరని దీనివలన బీమా కంపెనీ ల అధికారులకు ఏజెంట్లకు కమీషన్స్ తప్ప కార్మికులకు ఏ రకమైన ప్రయోజనం ఉండదని అన్నారు. వెల్ఫేర్ బోర్డు స్కీములను ఇన్సూరె న్స్ కంపెనీలకు అప్ప జెప్పవద్దని భవన నిర్మాణ కార్మిక సంఘాల (Building trade unions)జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో ఈ నెల 23న నిర్వహించ తలపెట్టిన చలో హైద రాబాద్ కు నిర్మాణ రంగ కార్మికులు పెద్ద ఎత్తున హాజరు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమం లో ఫెడరేషన్ జిల్లా నాయకులు అద్దంకి నరసింహ, పోలే సత్యనారాయణ,సల్వోజు సైదాచారి,బి వెంకటయ్య, గురువయ్య, మన్నెం శంకర్ ఎం రామకృష్ణ, బి రాజు తదితరులు పాల్గొన్నారు.