ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ మండలంలోని సంఘ బంధ సహాయకులు బి ఆర్ టి యు సంఘం నుండి తెలంగాణ ఐకెపి వివోఏల సంఘం (సిఐటియు) (CITU)లో సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ సమక్షంలో బుధవారం మండల పరిషత్ కార్యాలయం మహిళా సమాఖ్య సంఘమిత్ర భవన్ (Samakhya Sanghamitra Bhavan) దగ్గర మండలంలో ఉన్న మొత్తం 34 మంది వివో ఏ లు చేరారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కార్మిక హక్కుల (Labor rights) కోసం నికరంగా పోరాడే సంఘంలో చేరడం ఆనందంగా ఉందని అన్నారు. విడివిడిగా ఉన్న మమ్మలను ఏకం చేసి వివోఏలకు సంఘాలు ఏర్పాటు చేసి వేతనాలు ఇతర హక్కుల కోసం పోరాడిన ఏకైక సంఘం సిఐటియు అని అన్నారు. తిరిగి మాతృ సంస్థలో చేరిన మేము మా హక్కుల రక్షణ కోసం పోరాడుతామని తెలిపారు.
సిఐటియు జిల్లా సహాయ కార్యద ర్శి దండెంపల్లి సత్తయ్య, మండల కన్వీనర్ పోలే సత్యనారాయణ లు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Govt) మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా వెంటనే 10000 వేతనం నిర్ణయించాలని పిఎఫ్ ఈఎస్ఐ ప్రమాద బీమా పెన్షన్ సౌకర్యం కల్పించాలని అర్హత కలిగిన వివోఏలను సీసీలుగా పదోన్నతి కల్పించాలని వివో ఏ లకు లాప్టాప్ లు ఇచ్చి నెట్ సౌకర్యం కల్పించాలని సంఘ బంధాలకు గ్రామాలలో భవనాలు నిర్మించాలని డిమాండ్ చేశారు.బి ఆర్ టి యు నుండి సిఐటియు లో చేరిన వారు కాసర్ల సువర్ణ, జిల్లపెళ్లి మంగ, జె కవిత, పున్నం సంతోష , ఎల్లబో యిన పార్వతమ్మ, గోపగోని రాణి, కాసాని శైలజ, ఓర్సు పద్మ, అలివేలు, పి సంధ్య, కుందనపల్లి కవిత, కళ్యాణి సంధ్య, బోగరి పుష్ప, కోటేశ్వరి , బాకీ శైలజ తదితరులు ఉన్నారు