CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:ఎందరో అమరవీరుల త్యాగంతో తెచ్చుకు న్న స్వాతంత్రాన్ని కార్పొరేట్ కబం ధహస్తాల నుండి దేశాన్ని కాపాడు కుందామని సిఐటియు జిల్లా ఉపా ధ్యక్షులు ఎండి సలీం, రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు నన్నూరి వెంక టరమణారెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కూలీల (Women workers)జిల్లా కన్వీనర్ దండెంపల్లి సరోజ పిలు పునిచ్చారు.సిఐటియు (CITU), రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల అఖిలభారత కమిటీ పిలుపుమేరకు నలగొండ పట్టణం పెద్ద బండలో బుధవారం రాత్రి జరిగిన జన జాగరణ కార్యక్రమంలో భాగంగా విగ్నేశ్వర కోలాట బృందం చే కోలాట నుత్య ప్రదర్శన, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు కురుమయ్య చే మెజీషియన్, ప్రజానాట్యమండలి కళాకారులతో ఆటపాట కార్యక్రమం అర్ధరాత్రి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర బిజెపి మోడీ (BJP Modi)ప్రభుత్వ విధానాల వలన అమరవీరుల త్యాగబలంతో వచిన్న స్వాతంత్రన్నీ కార్పొరేట్ల కబంధహస్తాల్లో బందీ అయిపోతుందని దానిని రక్షించుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని అన్నారు. రైతాంగానికి కనీసం మద్దతుల చట్టం చేయాలని స్వామినాథన్ కమిషన్ సిఫారసుల అమలు చేయాలని డిమాండ్ చేశారు.
కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను (Labor Codes) రద్దు చేయాలని ,కనీస వేతనం 26,000, కాంట్రాక్ట్ ఔట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేయాలని సమాన పనికి సమాన వేతనం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కేంద్ర బడ్జెట్లో ఉపాధి హామీ పథకానికి నిధులు పెంచి పట్టణ ప్రాంతాలకు విస్తరింప చేయాలని 200రోజులకు పనిదినాలకు పెంచి రోజు కూలి 600 ఇవ్వాలని డిమాండ్ చేశారు. మహిళలకు రక్షణ కల్పించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. వెంటనే 33 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. భిన్నత్వంలో ఏకత్వం కలిగిన భారత దేశంలో కులమతాల చిచ్చుపెట్టి ప్రజల మధ్య చీలికలు తీసుకొస్తూ ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్లకు అమ్ముతూ దేశ సార్వ భౌమత్వాన్ని (Sovereignty of the country) తాకట్టు పెడుతు న్నారని ఆరోపించారు. సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండెంపల్లి సత్తయ్య అధ్యక్షతన జరిగిన జన జాగరణ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి మల్లం మహేష్ ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, జిల్లా సహాయ కార్యదర్శి భూతం అరుణ, కెవిపిఎస్ జిల్లా సహాయ కార్యదర్శి గాదె నరసింహ, సిఐటియు, రైతు, వ్యవసాయ కార్మికసంఘాలు, ఇతర ప్రజాసంఘాల నాయకులు కుంభం కృష్ణారెడ్డి ,అద్దంకి నరసింహ ,బొల్లు రవీందర్ ,పాక లింగయ్య, మన్నే శంకర్ కొత్త అశోక్ తెలకపల్లి శ్రీను కుంభం లక్ష్మమ్మ పాక మల్లయ్య బోయపల్లి చంద్రమ్మ లింగమ్మ వడ్డే ధనమ్మ గుండె కవిత, లింగయ్య సంజీవ తదితరులు పాల్గొన్నారు.