Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CITU: ఆశలకు కనీస వేతనం అమలు చేయాలి

–బి ఎల్ ఓ డ్యూటీలను రద్దు చేయాలి
–సిఐటియు జిల్లా అధ్యక్షులు సిహె చ్ లక్ష్మీనారాయణ

CITU: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఆశా వర్కర్లను కేంద్ర ప్రభుత్వం పర్మినెంట్ (Central Govt makes Asha workers permanent)చేయాలని అప్పటివరకు 26వేల కనీస వేతనాలు ఇవ్వాలని , పీఎఫ్ ఈఎస్ఐ ఉద్యోగ భద్రత కల్పించాలని జిల్లాలో ఆశాలకు వేస్తున్న బీఎల్ఓ డ్యూటీలను రద్దు చేయాలని సిఐటియు జిల్లా అధ్యక్షులు చినపాక లక్ష్మీనారాయణ మోడీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.బుదవారం తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ ( సిఐటియు) నల్గొండ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ మరియు డిఎం&హెచ్ఓ ఆఫీస్ సూపరిండెంట్* లకు వినతిపత్రం ఇచ్చారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం స్కీం లో భాగంగా దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఆశా వర్కర్లు వైద్య ఆరోగ్యశాఖలో ప్రజలకు అనేక రకాల వైద్య సేవలు (Medical services)అందిస్తున్నారని కానీ వీరికి మాత్రం కనీస వేతనాలు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 45,46 ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులను అమలు చేయాలని,ఎన్ హెచ్ ఎం ను ప్రభుత్వ ఆరోగ్య శాఖగా మార్చాలని కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకొచ్చిన కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కోడ్లను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.ఆశా వర్కర్ల కు బి ఎల్ వో డ్యూటీ ల నుండి మినహాయింపు ఇవ్వాలని ఆయన కోరారు.

పట్టణ గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలకు ఇప్పటికే అనేక రకాల ఆరోగ్య సేవలు (Medical services) అందిస్తున్న ఆశలకు ఈ పనులు పక్కకు పెట్టి బిఎల్ ఓ లుగా డ్యూటీ వేయడం తగదని అన్నారు. అనేక ప్రాంతాల్లో విష జ్వరాలు వర్షాల వల్ల ప్రజలు అనారోగ్యానికి గురై తీవ్రమైన ఇబ్బందుల్లో ఉంటే ఆ పనులు చేయించకుండా బిఎల్ఓ డ్యూ టీలు వేసి ఆశాలను ఇబ్బంది పెట్టడం సరికాదని విమర్శించారు. వెంటనే బిఎల్ఓ డ్యూటీ లో రద్దు చేయాలని కోరారు. అసెంబ్లీ, పార్ల మెంటు ఎన్నికలలో (Election of Assembly and Parliamentవిధులు నిర్వ హించిన ఆశాలకు డబ్బులు వెంట నే చెల్లించాలని ఆయన ప్రభుత్వా న్ని కోరారు. ఆశాలకు పీఎఫ్, ఈఎ స్ఐ, ప్రమాద బీమా,రిటర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని కోరారు.

అసెంబ్లీ ఎన్నికల (Assembly elections) ముందు కాంగ్రెస్ ప్రభుత్వం తన మేనిఫెస్టోలో ఆశా వర్కర్లకు (Asha workers) వేతనాలు పెంచుతామని ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఎగ్జామ్ పెట్టి నిర్ణయాన్ని రద్దు చేయాలని,ప్రసూతి సెలవులు కల్పిస్తూవెంటనే సర్కులర్ జారీ చేయాలన్నారు.సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి దండంపల్లి సత్తయ్య,యూనియన్ జిల్లా కార్యదర్శి తవిటి వెంకటమ్మ* లు మాట్లాడుతూ అనేక సంవత్సరాల నుండి పెండింగ్ లో ఉన్న రిజిస్టర్ ను తొందరగా ప్రింట్ చేసి ఆశలకు అందించాలన్నారు. ఆశాలకు ఏఎన్ఎం, జిఎన్ఎమ్ ప్రమోషన్ సౌకర్యం కల్పించాలని, టెన్త్, ఓపెన్ టెన్త్, ఇంటర్ ఓపెన్, ఇంటర్, డిగ్రీ, టెట్, గ్రూప్ 1,2 తదితర ఎగ్జామ్స్ సందర్భంగా ఆశాలకు వేస్తున్న డ్యూటీలకు డబ్బులు చెల్లించాలన్నారు. ఆశా లకు పారితోషకాల గైడ్ లైన్స్ కు భిన్నంగా ఏ ఎన్ సి తదితర టార్గెట్స్ ఎక్కువ కేసులు నమోదు చేయాలని ఆశాలను వేధింపులకు గురిచేస్తున్న అధికారులపై చర్య లు తీసుకోవాలని ఆయన ప్రభు త్వాన్ని కోరారు. ఈ కార్య క్రమంలో జిల్లా నాయకులు పోలే సత్యనారా యణ, యూనియన్ జిల్లా నాయకులు టీ పార్వతమ్మ, ఎన్ పూలమ్మ, చింత వజ్రమ్మ, సుజాత, ప్రేమలత వీరభద్రమ్మ అనురాధ షమీమ్ గోపిక శోభారాణి, సిహెచ్ జానకి తదితరులు పాల్గొన్నారు.