CM Revanth Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఫ్యూ చర్ సిటీ పేరుతో దేశంలోనే ఒక గొ ప్ప నగరాన్ని నిర్మించాలన్నది తెలం గాణ ప్రభుత్వ లక్ష్యమని ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి పునరుద్ఘాటిం చారు. న్యూయార్క్, లండన్, టోక్యో, సియోల్, దుబాయ్ తరహా ప్రపంచ నగరాలతో పోటీ పడాలన్న ప్రభుత్వ ఆకాంక్షకు అనుగుణంగా పెట్టుబడులతో ముందుకు రావాల ని పారిశ్రామిక వేత్తలకు ఆహ్వానం పలికారు. హైదరాబాద్లోని గ్రీన్ బిజినెస్ సెంటర్లో జరిగిన భారత పరిశ్రమల సమాఖ్య (CII) జాతీయ కౌన్సిల్ సమావేశంలో ముఖ్యమం త్రి ప్రసంగిస్తూ పారిశ్రామికాభివృద్ధి లో తెలంగాణ ప్రభుత్వ లక్ష్యాలను వివరించారు. తెలంగాణలో ఆర్థిక వ్యవస్థ వృద్ధి చెందడానికి, స్వేచ్ఛా వాణిజ్యం, మార్కెట్లు పనిచేయడా నికి పారిశ్రామిక రంగం సహకరించా లని కోరారు. ప్రపంచంలోనే అత్యు త్తమ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినె స్ అందించడానికి తెలంగాణ రా ష్ట్రం సిద్ధంగా ఉందని చెప్పారు.
తెలంగాణ రైజింగ్ (Telangana Rising) లక్ష్యంతో సేవల రంగం కేంద్రీకృతంగా ఫోర్త్ సిటీని నిర్మించా లన్నది ప్రభుత్వ ఆకాంక్ష అని , హైదరాబాద్లో సంపూర్ణంగా నెట్ జీరో లక్ష్యాలతో పనిచేస్తున్నామ న్నారు. హైదరాబాద్ నగరాన్ని కాలుష్య రహిత నగరంగా మార్చ డంలో భాగంగా 3200 ఆర్టీసీ బ స్సుల స్థానంలో విద్యుత్ వాహ నాలను సమకూర్చబోతు న్నామ న్నారు. ఎలక్ట్రిక్ వాహనాలపై రిజి స్ట్రేషన్, రోడ్ టాక్స్లను పూర్తిగా రద్దు చేశామని, ప్రస్తుతం ఎలక్టిక్ వాహనాల అమ్మకాలు అత్యంత వేగంగా పెరుగుతున్నాయని తెలి పారు. వరదలు లేని నగరంగా, దేశంలోనే పర్యావరణ హితమైన హైదరాబాద్ను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో చర్యలు చేపట్టామని, అందులో భాగంగా 55 కిలోమీటర్ల పొడవైన మూసీ పునరుజ్జీవ పను లను ప్రారంభించాం. 2050 నాటికి అవసరమయ్యే తాగునీటి అవస రాలకు అవసరమైన కార్యాచర ణను ఇప్పటి నుంచే ప్రారంభించ డం జరిగిందని వెల్లడించారు.
తెలంగాణ మణిహారంగా రీజినల్ రింగ్ రోడ్డు నిర్మాణం చేపట్టామని, అవుటర్ రింగ్ రోడ్డుకు రీజినల్ రింగ్ రోడ్డుకు మధ్యన రేడియల్ రోడ్లను నిర్మించబోతున్నామని గుర్తు చేశారు. ఆయా ప్రాంతాల్లో ఫార్మా, లైఫ్ సైన్సెస్, ఏరోస్పేస్, డిఫెన్స్, ఈవీ, సోలార్ పవర్ వంటి పరిశ్రమలు అక్కడ ఏర్పాటు చేయ బోతున్నామని వివరించారు. 360 కి.మీ పొడవు ఉండబోయే రీజినల్ రింగ్ రోడ్డు వెంట రీజినల్ రింగ్ రైల్ ను నిర్మించాలని ప్రధానమంత్రి ని కోరామని, రీజినల్ రింగ్ రోడ్ చు ట్టూ తయారీ పరిశ్రమ, మార్కెటింగ్ కు అవసరమైన కేంద్రీకృత ప్రదేశాల ను ఏర్పాటు చేయాలన్నది మా ఉ ద్దేశ్యమని, చైనా తరహాలో రకరకా ల క్లస్టర్లను సృష్టించాలని భావిస్తు న్నామని ఆకాంక్షించారు. ఒక లైట్ సిటీ, మార్బుల్ సిటీ, గ్రానైట్ సిటీ, ఫర్నీచర్ సిటీ, ఇలా ప్రత్యేక తర హాలో రీజినల్ రింగ్ రోడ్డు చూట్టూ మార్కెటింగ్ కార్యకలాపాల విస్త రణకు ప్రయత్నిస్తున్నామని చెప్పా రు. రీజినల్ రింగ్ రోడ్ పూర్తయితే తెలంగాణ ప్రాంతంలో 70 శాతం పట్టణీకరణ జరుగుతుంది. రింగ్ రోడ్డు ఆవలివైపున గ్రామీణ తెలం గాణ సమగ్రాభివృద్ధి లక్ష్యంగా వ్యవసాయం, సేంద్రీయ సాగు, రైతుల కోసం గిడ్డంగులు, కోల్డ్ స్టోరేజీల ఏర్పాటుపై ప్రభుత్వం దృష్టి సారించడం జరిగిoదన్నారు.
తెలంగాణకు సముద్ర తీరప్రాంతం లేని కారణంగా డ్రై పోర్టును ఏర్పా టు చేస్తున్నామని, పోర్టుతో అను సంధానం చేయడానికి మచిలీప ట్నం ఓడరేవు వరకు ప్రత్యేక రహ దారి, రైల్వే కనెక్టివిటీని ప్రతిపాదిం చామని పేర్కొన్నారు. నైపుణ్యత పెంచడానికి ఉద్యోగ, ఉపాధి అవ కాశాలను మెరుగుపరచడంపై ప్రధానంగా దృష్టి సారించాం. చైనా ప్లస్ వన్ వ్యూహంలో హైదరాబాద్ ను ప్రపంచంలో ప్రధాన పెట్టుబడు ల కేంద్రంగా ఉండేలా చర్యలు తీసు కుంటున్నామని, సీఐఐ జాతీయ కౌన్సిల్ సమావేశాన్ని హైదరాబాద్ లో నిర్వహించడం శుభ పరిణా మ మని, అత్యుత్తమ వ్యాపార సౌల భ్యాలను అందించడానికి తెలం గాణ సిద్ధంగా ఉందని, సీఐఐ కలిసి రావాలని అందరం కలిసి అద్భు తాలు సాధించవచ్చని పిలుపు నిచ్చారు. ఈ సమావేశంలో సీఐఐ అధ్యక్షుడు సంజీవ్ పూరి, వైఎస్- ప్రెసిడెంట్ ఆర్. ముకుందన్, సీఐఐ డైరెక్టర్ చంద్రజీత్ బెనర్జీ, పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ తో పాటు సీఐఐ ప్రతినిధులు, ఆయా కంపెనీల ప్రతి నిధులు పాల్గొన్నారు.