CMRF cheques:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ జిల్లా లో వివిధ అనారోగ్య సమస్యలతో (Health problems)పలు ప్రైవేట్ హాస్పిటల్స్ లో (Private Hospitals) చికిత్స పొందుతూ ప్రభుత్వ సహాయం అభ్యర్థించిన 112 మంది నిరుపేద ప్రజలకు ముఖ్యమంత్రి సహాయనిది (CMRF)పథకం ద్వారా మంజూరైన రూ. 36,26,500 విలువ గల చెక్ లను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేం దర్ రెడ్డి (Chairman Gutta Sukhender Reddy)అందజేశారు. సోమవారం నల్గొండ పట్టణంలోని క్యాంపు కా ర్యాలయంలో లబ్ధిదారులకు తె లంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు.
ఈ సం దర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి సహాయనిధీ పథకం (Aid scheme)నిరుపేదలకు వరం లాంటిది అన్నా రు. ఈ పథకం ద్వారా లక్షలాది మంది పేదలకు సహాయం అందు తుందని చెప్పారు. నిరుపేద ప్రజల కు సహాయాన్ని అందించడం సంతో షంగా ఉందన్నారు. ఈ నాయకులు కార్యక్రమంలో మందడి మధుసూద న్ రెడ్డి, యామ దయాకర్, లింగస్వామి గౌడ్ (Madhusuda N Reddy, Yama Dayakar, Lingaswamy Goud)తదితరులు ఉన్నారు.