Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

SP Chandana Deepti:స్ట్రాంగ్ రూమ్ ల పరిశీలన

పార్లమెంటు ఎన్నికల పోలింగ్ లో పోలైన ఈవీఎంలను నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్ప లపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల లో భద్రపరచడం జరిగింది.

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: పార్లమెంటు ఎన్నికల(Parliamentary Elections)పోలింగ్ లో పోలైన ఈవీఎంలను నల్గొండ జిల్లా కేంద్రం సమీపంలోని అనిశెట్టి దుప్ప లపల్లి గోదాంలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ ల లో భద్రపరచడం జరిగింది.నల్గొండ పార్లమెంటు నియోజకవర్గం పరిధి లోకి వచ్చే దేవరకొండ, నాగార్జున సాగర్, మిర్యాలగూడ, హుజూర్ నగర్, కోదాడ, సూర్యాపేట, నల్గొం డ అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంలన్నింటిని అనుశెట్టి దుప్పలపల్లి గోదాంలో ఆయా నియోజకవర్గాల వారిగా ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూముల లో కేంద్ర ఎన్నికల సంఘం జిల్లా సాధారణ పరిశీలకులు మనోజ్ కుమార్ మాణిక్ రావు సూర్యవంశీ సమక్షంలో, రాజకీయ పార్టీల ప్రతినిధులు, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు హాజరు కాగా, జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన, జిల్లా ఎస్పీ చందన దీప్తి(SP Chandana Deepti) ఆధ్వర్యం లో ఈవీఎం లను భద్రపరచడం జరిగింది.

ఈవీ ఎంలు భద్రపరిచిన స్ట్రాంగ్ రూము లతో పాటు దుప్పలపల్లి గోదాం మొత్తం పూర్తిగా సిఆర్పిఎఫ్ భద్రత, పోలీస్ భద్రతలో ఉంచడం జరిగిం ది. సోమవారం పార్లమెంట్ ఎన్నికల పోలింగ్(Polling) ముగిసిన తర్వాత ఆయా అసెంబ్లీ నియోజక వర్గాల వారిగా ఈవీఎంలు అన్ని దుప్పలపల్లి గోదాం కు చేరుకోగా వాటన్నిటినీ స్ట్రాంగ్ రూములలో ఉంచి ఎన్నికల పరిశీలకుల సమక్షంలో వాటికి సీల్ వేయడం జరిగింది. ఈ కార్యక్రమం లో రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తో పాటు, అన్ని అసెంబ్లీ(Assembly) నియోజక వర్గాల అసిస్టెంట్ రిటర్నింగ్ అధికా రులు, నల్గొండ,సూర్యాపేట జిల్లాల ఆర్డీవోలు , అడిషనల్ ఎస్పి రాములు, జిల్లా రెవెన్యూ అధికారి డి. రాజ్యలక్ష్మి ,పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ కోటేశ్వరరావు,డి ఆర్ డి ఓ నాగిరెడ్డి, జిల్లా ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు సంగీతలక్ష్మి, జిల్లా పంచాయతీ అధికారి మురళి, పంచాయతీరాజ్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ భూమన్న, డిఎస్పి శివ రామిరెడ్డి, జిల్లా అధికారులు, ఎలక్షన్ విభాగం సూపరింటిండెంట్ విజయ్, చంద్ర వదన తహసిల్దా రులు తదితరులతో పాటు, ఇండి యన్ నేషనల్ కాంగ్రెస్ నుండి శంకర్ నాయక్, బిఆర్ఎస్ నుండి పంకజ్ యాదవ్, బిజెపి నుండి నూకల నరసింహారెడ్డి, పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు గోలి సైదులు, చోలేటి ప్రభాకర్, సిరిశాల సీనయ్య, స్వతంత్ర అభ్యర్థుల తరఫున వారి ప్రతినిధులు యాదగిరి, నరసింహ తదితరులు.

Collector inspection strong rooms