— నల్లగొండ జిల్లా కలెక్టర్ నారాయణరెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: ప్రజా సమస్యలను గ్రామస్థాయి లోనే పరిష్కరించాలన్న ఉద్దేశంతో మండల ప్రజావాణి కార్యక్రమాన్ని చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సి. నారా యణరెడ్డి (Collector Narayana Reddy)తెలిపారు. ప్రతి సోమ వారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమంలో (In a public radio program) భాగంగా మండల స్థాయిలో కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున నిర్వహించాలని ఇదివరకే జిల్లా కలెక్టర్ నిర్ణయించిన విషయం తెలిసిందే.ఇందులో భాగంగానే మొదటి సోమవారం ఆయన నల్గొండ జిల్లా (NALGONDA) చింతపల్లి, నాంపల్లి మండలాల లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి హాజరయ్యారు. ప్రజావాణి కార్యక్రమం జరిగే తీరుతెన్నులను తెలుసుకోవడమే కాకుండా మండ ల స్థాయి అధికారులు, గ్రామ పంచా యతీ కార్యదర్శులతో ప్రజావాణి కార్యక్రమం పై మాట్లాడి సూచనలు, సలహాలు ఇచ్చారు. ‘
అంతేకాక జిల్లా కలెక్టర్ స్వయంగా ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను (COMPLAINTS)స్వీకరించారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారానికి మండల ప్రజావాణి నిర్వహిస్తున్నామ న్నారు.ఎక్కడి సమస్యలకు అక్కడే పరిస్కారందొరకాలని, ప్రత్యేకించి గ్రామ స్థాయిలోనే సమస్యలు పరిష్కారం కావాలన్న ఉద్దేశ్యంతో మండల స్థాయి ప్రజావాణి (public radio program)చేపట్టామన్నారు. ప్రతి సోమవారం రెగ్యులర్ గా ప్రజావాణి నిర్వహించాలని,ప్రతి ఫిర్యాదును క్షున్నంగా చదవాలని, పరిష్కారం అయ్యేవి వెంటనే పరిష్కరించాలని,లేకుంటే పిర్యాదుదారుకు స్పష్టంగా చెప్పాలన్నారు. ప్రతి సోమ వారం మధ్యాహ్నం పంచాయతీ (Panchayat) కార్యదర్శులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని, ఆ సమావేశంలో రాబోయే వారం, నెలలో చేయాల్సిన పనులు చర్చించాలని సూచించారు. ఎన్నికల కోడ్ (Election Code) వల్ల రెగ్యులర్ కార్యక్రమాలకు ఆటంకం ఏర్పడిందని,సుమారు 10 నెలల తర్వాత తిరిగి పాలనపై ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించే అవకాశం కలిగిందని,కొత్త ప్రభుత్వం ప్రజా పాలన కార్యక్రమం కింద వివిధ కార్యక్రమాలను అమలు చేస్తున్నది తెలిపారు.
ఇందులో భాగంగా ఇదివరకే ఉచితబస్సు (FREE BUS),గృహజ్యోతి,ఆరోగ్య శ్రీ, పథకాలు అమలు చేసిందని,తక్కినవి సైతం అమలు చేయడం జరుగుతుందని తెలిపారు. ప్రజాపాలన కింద లబ్ది నేరుగా లబ్ధిదారుకే వెళ్ళాలని, మండల, గ్రామ స్థాయి లో రెగ్యులర్ శానిటేషన్,విద్య,వైద్యం,వ్యవసాయం తదితర కార్యక్రమాలు నిరంతరం కొనసాగలని కార్యదర్శులకు సూచించారు. ప్రజా పాలన పథకాల అమలు కు ప్రాధాన్యమివ్వాలని సూచించారు. ప్రతి గ్రామంలో ప్రజా పాలన కింద లక్ష్యాన్ని నిర్దేశించుకోవాలని, ధరణి సమస్యల పరిష్కారానికి అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, నిజమైన రైతు పట్టా కోసం ఇబ్బంది పడరాదని చెప్పారు.పథకాల అమలులో పంచాయతీ కార్యదర్శిది ముఖ్య పాత్ర అని, ఆయా పథకాల కింద గ్రామ స్థాయిలో లబ్ధిదారులను గుర్తించాలని, పంచాయతీ కార్యదర్శికి 2 నెలల్లో గ్రామం పై, భూములు అన్నింటి పై పట్టు రావాలని,గ్రామ పంచాయతీ టీమ్ (Gram Panchayat Team) చురుకుగా పని చేయాలని,టీమ్ కు గ్రామంలోని ప్రతి వ్యక్తి పై అవగాహన కలిగి ఉండాలని, గ్రామ స్థాయిలో పరిష్కారం కాని ఫిర్యాదులు మండల స్థాయికి రావాలని, గ్రామ పంచాయతీ టీమ్ బలోపేతం కావాలని,రానున్న రోజుల్లో పంచాయతీ కార్యదర్శి పాత్ర చాలా ముఖ్యమని అన్నారు.గ్రామ పంచాయతీలో మినీ కలెక్టరేట్ లాగా పని చేయాలని,ప్రతి అంశం పై పంచాయతీ కార్యదర్శులకు శిక్షణ ఇస్తామని కలెక్టర్ తెలిపారు.గ్రామ పంచాయతీలో జరిగే పనులు సవ్యంగా జరగాలని,ఎలాంటి ఫిర్యాదులు రావద్దని అన్నారు. ఈ సందర్బంగా జిల్లా కలెక్టర్ ప్రజల వద్దనుండి స్వయంగా ఫిర్యాదులు స్వీకరించి పరిష్కరించారు. గ్రామ పంచాయతీ కార్యదర్శులను తన వద్దకు పిలిపించుకుని సమస్యల పై చర్చించి చర్యలు తీసుకున్నారు. దేవరకొండ,చండూరు ఆర్ డి ఓలు శ్రీరాములు, సుబ్రహ్మణ్యం,మండల ప్రత్యేకాధికారులు డి డబ్ల్యుఓ సక్కుబాయి, సర్వే ల్యాండ్ రికార్డ్స్ ఏ డి శ్రీనివాసులు,తహసీల్దార్లు, విజయకుమార్, దేవసింగ్,ఎంపిడివోలు సుజాత, మేరీ స్వర్ణకుమారి,ఎంపిపిలు భవాని,శ్వేతా రెడ్డి, ఇతర అధికారులు,తదితరులు హజరయ్యారు.