Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CollectorTripati : విద్యార్థులు కష్టపడి ఉత్తమ ఫలితాలు సాధించాలి

–నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి

CollectorTripati ప్రజా దీవెన, నల్లగొండ: పదవ తరగతిలో ఉత్తమ ఫలి తాల సాధనకు విద్యార్థినులు కష్ట పడి చదవాలని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపా ఠి అన్నారు. మంగళవారం ఆమె నల్గొండ జిల్లా, మిర్యాలగూడ డివిజన్ కేంద్రంలోని జిల్లా పరిషత్తు బాలికల ఉన్నత పాఠశాలను ఆక స్మికంగా తనిఖీ చేశారు.పదవ తర గతి సెక్షన్ ఈ-3 ఈ లకు వెళ్లి వి ద్యార్థులతో ముఖాముఖి మాట్లా డి వారి విద్యా సామ ర్ధ్యాలను పరి శీలించారు.10వ తరగతి ఈ -3 సెక్షన్లో గణితం పై ముఖ్యంగా సంభావ్యత పై విద్యార్థినులను ప్రశ్న ,జవాబులు అడగడమే కాకుండా, బోర్డుపై లెక్కలను వేసి సమాధానాలను రాబట్టారు.

మీకు ఏ సబ్జెక్టు అంటే ఇష్టం ఏ టీచర్ ఇష్టం ఎంతమంది హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారని పాఠశాలలో విద్యాబోధన ఎలా ఉందని భోజనం ఎలా ఉందని తదితర వివరాలన్నింటిని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనం తరం జిల్లా కలెక్టర్ పాఠశాల వం టగదిని తనిఖీ చేశారు. వంటగది లోకి ,బల్లులు,పురుగులు వంటివి రాకుండా కిటికీలకు మెష్ ఏర్పాటు చేయాలని హెడ్మాస్టర్ విజయ్ కుమారిని ఆదేశించారు. అలాగే నూతనంగా ఏర్పాటు చేసిన డైనింగ్ హాల్లో ఫ్యాన్స్ ఏర్పాటు చేయాలని చెప్పారు.

ఈ సంద ర్భంగా ఆమె విద్యార్తినిలతో మాట్లాడుతూ బాగా కష్టపడి చదివి మంచి మార్కులు సాధించాలని, పదవ తరగతి అన్నింటికి పునాది వంటిదని చెప్పారు. సమయం వృధా చేసుకోకుండా అన్ని అంశాల పట్ల అవగాహన పెంచుకోవాలన్నారు. పాఠశాల హెడ్మాస్టర్ తో ఆమె మాట్లాడుతూ పాఠశాలలో విద్యార్థినుల సంఖ్య, విధ్యా బోధన, భోజనం ,ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. జిల్లా కలెక్టర్ వెంట జిల్లా సంక్షేమ అధికారిని కృష్ణవేణి ,మండల విద్యాశాఖ అధికారి బాలు, తదితరులు ఉన్నారు.