ధరణి పోర్టల్ పెండింగ్ దరఖాస్తులు పరిష్కరించాలని అధికారులను ఆదేశించిన జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి
మునుగోడు ప్రజా దీవెన జనవరి 3 మండల తాసిల్దార్ కార్యాలయంలో జరుగుతున్న ధరణి పోర్టల్ పెండింగ్లో దరఖాస్తులు పరిశీలన నిమిత్తం నాంపల్లి మండలం తాసిల్దార్ కార్యాలయాన్ని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి గురువారం రోజున ఆకస్మికంగా తనిఖీ చేశారు అనంతరం కార్యాలయంలో ఉన్న ధరణి పోర్టల్ దరఖాస్తులను పరిష్కారాలు వేగవంతం చేయాలని ధరణి దరఖాస్తులను పరిశీలించి టీఎం 33 పార్టిషన్ సక్సేషన్ తదితర భూములకు సంబంధించి అన్ని కేసులను వేగవంతం చేసి పరిష్కరించే వాటికి ఆర్ఐ సర్వేయర్లు దరఖాస్తుదారుతులుతో పాటు క్షేత్రస్థాయికి వెళ్లి జియో కోఆర్డినేటర్స్ తో వివరాలను సమర్పించి త్వరగా చర్యలు తీసుకోవాలని మండల తహసిల్దార్ దేవ సింగ్ ను ఆదేశించారు.
అదే సమయంలో మండల పరిధిలోని నారాయణరెడ్డి వెంకట్రెడ్డి నుండి భూమి సమస్యలు దరఖాస్తులను స్వీకరించారు ఇందిర ఇండ్ల స సర్వే నాణ్యతగా ఉండాలని అధిక అధికారులు అశ్రద్ధగా ఉండకుండా చూడాలని మండల పరిషత్ అభివృద్ధి అధికారి స్వర్ణ కుమారుని ఆదేశించారు ఈ కార్యక్రమంలో నాంపల్లి మండలం తాసిల్దార్ దేవ సింగ్ ఎంపీడీవో స్వర్ణకుమారి కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు