CollectorTripati ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : ప్రజా పాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేయనివారు ప్రస్తుతం ఎంపీడీవో, మున్సిపల్ కమిషనర్ కార్యాలయాలలో ఏర్పాటుచేసిన ప్రజా పాలన మీ- సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు.ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం ఆమె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు. అనంతరం జిల్లా అధికారులతో వివిధ అంశాల పై ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ సందర్భంగా వివిధ కారణాల వల్ల కొంతమంది ఇందిరమ్మ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకోలేదని ,అలాంటివారు ఇప్పుడు సంబంధిత ఎంపీడీవో కార్యాలయంలో లేదా మున్సిపాలిటీకి చెందిన వారైతే మున్సిపల్ కమిషనర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రజాపాలన మీ-సేవా కేంద్రాలలో దరఖాస్తు చేసుకోవచ్చని ఆమె తెలిపారు.
ఇందిరమ్మ ఇండ్ల సర్వే కార్యక్రమాన్ని వేగవంతం చేసి ప్రభుత్వం నిర్దేశించిన ఈ నెల 31 లోపు సర్వేను పూర్తి చేసే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని, సర్వే చివరి దశకు చేరుకున్నందున జాగ్రత్తగా ,నాణ్యతగా ఉండేలా చూడాల్సిన అవసరం మండల ప్రత్యేక అధికారులపై ఉందని ఆమె చెప్పారు. సర్వే నాణ్యత పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని అన్నారు.ఇప్పటివరకు జిల్లాలో ఇందిరమ్మ ఇండ్ల సర్వేను బాగా చేయటం పట్ల ఆమె మండల ప్రత్యేక అధికారులను ,ఎంపీడీవోలను అభినందించారు.ప్రజావాణి ఫిర్యాదులను ఎప్పటికప్పుడే పరిష్కరించాలని, పెండింగ్లో ఉంచవద్దని అన్నారు. ముఖ్యంగా పిర్యాదుదారులు మళ్ళీ మళ్ళీ తిరగకుండా ఫిర్యాదు పరిష్కారంపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని ,పరిష్కారం అయ్యేలా ఉంటే తక్షణమే పరిష్కారం చేయాలని, లేనట్లయితే ఎందుకు పరిష్కారం కావడం లేదో ఫిర్యాదు దారుకి తెలియజేయవలసిన బాధ్యత జిల్లా అధికారులపై ఉందని అన్నారు. ఇదే పద్ధతిని డివిజన్, మండల స్థాయిలో సైతం ఫిర్యాదుదారులకు తెలియజేసి ఫిర్యాదులు పెండింగ్ల లేకుండా చూసుకోవాలని అన్నారు.
కాగా (66) మంది ఫిర్యాదుదారులు వారి ఫిర్యాదులను సమర్పించారు.అదనపు కలెక్టర్ జే. శ్రీనివాస్, డిఆర్ఓ అమరేందర్ ,గృహ నిర్మాణ పిడి రాజకుమార్ ,డి ఆర్ డి ఓ శేఖర్ రెడ్డి ,జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.