ప్రజా దీవెన, నల్లగొండ: సమగ్ర శిక్ష కాంట్రాక్ట్ ఉద్యోగులందరి నీ ప్రభుత్వం వెంటనే క్రమబద్ధీక రించాలని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగం గౌడ్ డిమాండ్ చేశారు.ఈ సంద ర్బంగా అయన మాట్లాడుతూ గత ఐదు రోజులుగా వారు నిరవధిక సమ్మె చేస్తున్నారని విద్యాశాఖ లోని సమగ్ర శిక్ష మన రాష్ట్రంలో విద్యారంగ అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్నదన్నారు.ఈ రంగంలో పనిచేస్తున్న ఉద్యోగ ,కార్మికులను రోస్టర్, మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, మరియు రాత పరీక్ష ద్వారా జిల్లా కలెక్టర్ చైర్మన్ గా ఉన్న కమిటీ చే ఇంటర్వ్యూలలో కనబరిచిన ప్రతిభ ఆధారంగా ఎంపిక చేసి వివిధ స్థాయిలలో విధులు నిర్వహిస్తున్నారు. గత 18 సంవత్సరాల నుండి సర్వ శిక్ష ఉద్యోగులు పాఠశాల విద్య అభివృద్ధి కోసం వారి నైపుణ్యాన్ని మరియు కృషిని అందిస్తున్నారు.
వీరిలో చాలామంది ఆర్థికంగా వెనుకబడిన పేద కుటుంబానికి చెందినవారు.వీరి యొక్క స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం వెంటనే వారి సమస్యల పరిష్కారం కొరకు సమ్మె చేస్తున్న వారిని తక్షణం ప్రభుత్వం చర్చలకు ఆహ్వానించి సమస్య పరిష్కారానికి చొరవ చూపాలని జాజుల పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో బీసీ విద్యార్థి సంఘం స్టేట్ ప్రెసిడెంట్ గొడుగు మహేష్ యాదవ్, విద్యార్థి సంఘం స్టేట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ పాలకూర కిరణ్ గౌడ్ ,బీసీ విద్యార్థి సంఘం స్టేట్ కోఆర్డినేటర్ కొప్పుల చందు గౌడ్, ఎల్బీనగర్ యువజన సంఘం అధ్యక్షుడు స్వామి కుమార్, బీసీ విద్యార్థి సంఘం గ్రేట్ హైదరాబాద్ జనరల్ సెక్రటరీ అనంతుల సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు