ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :నల్గొండ జిల్లా సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయము ముందు తమను రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేస్తూ పదవ రోజు నిరవధిక సమ్మె ఉదృతంగా కొనసాగుతుంది.విద్యాశాఖలోని సమగ్ర శిక్ష కాంట్రాక్టు ఉద్యోగులుగా రాష్ట్రవ్యాప్తంగా 19300 మంది నల్గొండ జిల్లాలో దాదాపుగా 1100 మంది వివిధ విభాగాలుగా పనిచేస్తున్నారు. గత 20 సంవత్సరాలుగా విద్యాశాఖ అభివృద్ధికి ఎంతో కృషి చేస్తూ ఉన్నారు. సరైన వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు.
వాట్సప్, ఫేస్ బుక్, ట్విట్టర్ వంటి సోషల్ మీడియాలో పోస్ట్ ద్వారా నిరసన తెలిపారు . అదే విధంగా ఈ సంవత్సరం పదవీ విరమణ చేసిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు సన్మానం చేశారు. మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు కాండిల్ లతో నివాళి అర్పించారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి సమగ్ర శిక్ష ఉద్యోగుల ఆవేదన వినాలని, రెగ్యులర్ చేస్తానని హామీ ఇచ్చి మౌనంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే మాకు న్యాయం చేయాలని లేని యెడల సమ్మె ఉధృతం చేస్తామని తెలిపారు.
గత సంవత్సరం వీరు చేసిన నిరసన కార్యక్రమాలకు 13.09.2023 న హన్మకొండ లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు విద్యా శాఖ లోని సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగుల అందరిని రెగ్యులర్ చెయ్యాలని ఆ లోపు తక్షణమే పే స్కెల్ అమలు చెయ్యాలని డిమాండ్ చేశారు.20 సంవత్సరాలుగా అతి తక్కువ వేతనాలతో శ్రమ దోపిడీకి గురి అవుతున్నామని, మా విలువైన జీవిత కాలం మొత్తం ప్రభుత్వాలు దోచుకున్నాయని, పెరిగిన నిత్యావసర ధరల వలన బ్రతకలేక చస్తున్నామని ఆవేదన, భారత దేశ అత్యున్నత న్యాయ స్థానం సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి – సమాన వేతనం వెంటనే అమలు చెయ్యాలని వేడుకుంటున్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ కొండ చంద్రశేఖర్, మహిళా అధ్యక్షురాలు గుమ్మల మంజులారెడ్డి, మహిళా కార్యదర్శి సావిత్రి, అసోసియేట్ ప్రెసిడెంట్ వి. సావిత్రి, కోశాధికారి పుష్పలత, సాయిల్, ఉపాధ్యక్షులు వెంకట్, జి వెంకటేశ్వర్లు,ఎర్రమల్ల నాగయ్య, ప్రచార కార్యదర్శి చందపాక నాగరాజు,బంటు రవి, లలిత, కొండయ్య, యాదయ్య, యాట వెంకట్, జి వెంకటేశ్వర్లు,ధార వెంకన్న, శ్రీనివాస్, వి రమేష్, వసంత, సుజాత, నిరంజన్, వెంకటకృష్ణ, నాగయ్య తదితరులు పాల్గొన్నారు.
సమగ్ర శిక్ష ఉద్యోగులకు వివిధ మండలాల విద్యాధికారులు మరియు రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి.కలెక్టర్ ఆఫీస్ ముందు జరిగిన సమ్మెకు వివిధ ఉపాధ్యాయ సంఘాలు మరియు వివిధ రాజకీయ పార్టీలు ,మల్లేపల్లి ఎంఇఓ ఆర్ నాగేశ్వర్ రావు, చందంపేట్ ఎంఇఓ కే చందర్, మాజీ ఎంఇఓ ఈ సంగ్యానాయక్, జూనియర్ లెక్చరర్ ఎన్ చందర్, బహుజన సమాజ్ పార్టీ జిల్లా అధ్యక్షుడు మామిడి సైదులు, బొడ్డు కిరణ్, కత్తుల కాన్షిరాం, ప్రధాన కార్యదర్శి కోడి భీమ్ ప్రసాద్ జిల్లా నాయకులు యాదగిరి, మర్రి శోభ
హాజరై మద్దతు తెలిపారు.