Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

CPM Leader: అంజిరెడ్డి మృతి ప్రజా ఉద్యమాలకు తీరని లోటు

తన జీవితాంతం పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించిన మహా నాయకుడు కామ్రేడ్ నన్నూరి అంజిరెడ్డి అని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.

సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి

ప్రభుత్వ ఆసుపత్రికి పార్థివ దేహం అప్పగింత

ప్రజా దీవెన నల్లగొండ: తన జీవితాంతం పేద ప్రజల అభ్యున్నతి కోసం నిరంతరం పోరాటాలు నిర్వహించిన మహా నాయకుడు కామ్రేడ్ నన్నూరి అంజిరెడ్డి(Anji Reddy) అని సిపిఎం(CPM) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు జూలకంటి రంగారెడ్డి అన్నారు.తిప్పర్తి మండలం అంతయ్య గూడెం గ్రామానికి చెందిన సిపిఎం సీనియర్ నాయకులు నన్నూరి అంజిరెడ్డి శనివారం రాత్రి అనారోగ్యంతో మరణించారు. ఆదివారం ఉదయం వారి పార్థివ దేహానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అంతిమయాత్ర అనంతరం జిల్లా కేంద్ర ప్రభుత్వ హాస్పిటల్ లకు అందజేశారు.

గ్రామ కూడలిలో జరిగిన సంతాప సభలో జూలకంటి రంగారెడ్డి మాట్లాడుతూ నల్లగొండ(Nalgonda) నియోజకవర్గంలో పేదల ఇళ్లస్థలాల కోసం పంచరాయి, పోరంబోకు భూములను పేదలకు పంపిణీ చేయడంలో కీలకపాత్ర పోషించాలని అన్నారు. రైతు వ్యవసాయ కార్మిక సంఘాలలో జిల్లా నాయకుడిగా పాలేరుల సంఘం ఏర్పాటుచేసి జీతాలు పెంపు కోసం వ్యవసాయ కూలీల రేట్ల పెంపు కోసం పోరాడిన నాయకుడిని అన్నారు. రాజకీయాల్లో ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా నీబద్ధతతో చివరి వరకు ఎర్రజెండా నాయకత్వంలో పనిచేశారని కొనియాడారు.

ఉపాధ్యాయ ఎమ్మెల్సీ నర్సిరెడ్డి(Narsireddy) మాట్లాడుతూ అంజిరెడ్డి పోరాట స్ఫూర్తి నేటి తరానికి ఎంతో ఆదర్శనీయమని వారి ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ కంకణ భద్దులు కావాలని పిలుపునిచ్చారు. సిపిఎం జిల్లా కార్యదర్శి ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుండి ఎర్రజెండా నాయకత్వంలో నల్గొండ నియోజకవర్గ వ్యాప్తంగా ప్రజా సమస్యల పట్ల నల్లగొండ సాగు, తాగునీరు కోసం ఎస్ఎల్బీసీ ద్వారానే పరిష్కార మార్గం అని సిపిఎం చేపట్టిన ఉద్యమంలో కీలకపాత్ర పోషించి విజయం సాధించారాని అన్నారు.

సిపిఎం మండల కార్యదర్శి మన్నెం బిక్షం అధ్యక్షతన జరిగిన సంతాప సభలో కుటుంబ సభ్యులు నన్నూరి వెంకటరమణారెడ్డి, మందడి సువర్ణ, సీపీఎం రాష్ట్ర,జిల్లా, మండల,వివిధ ప్రజా సంఘాల నాయకులు తుమ్మల వీరారెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, మల్లు నాగార్జున రెడ్డి, చినపాక లక్ష్మీనారాయణ, ఊట్కూరు నారాయణ రెడ్డి, మల్లు గౌతమ్ రెడ్డి, రాజశేఖర్ రెడ్డి, ఎడ్ల సైదులు, వెంకటేశం, ఆనంతుల శంకరయ్య, ఎండి. సలీం, దండంపల్లి సత్తయ్య, తుమ్మల పద్మ, దండెంపల్లి సరోజ, బిమాగాని శ్రీనివాస్ , బీమార్జున్ రెడ్డి, వంటేపాక యాదగిరి, బిమాగాని గణేష్, ఆకిటి లింగయ్య, శిశిధర్, దొంగరి వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి, మాజీ మునిసిపల్ చైర్మన్ సైదిరెడ్డి, లొడంగి గోవర్ధన్, కాంగ్రెస్ నాయకులు పాశం రామ్ రెడ్డి, సంపత్ రెడ్డి,సర్పంచ్ సిరిగిరి పద్మ, వెంకటరెడ్డి, తదితరులు పూలమాలలు వేసి నివాళులర్పించారు.

comrade anjireddy passed away