Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Vemula Gopinath: పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది..!

పేద ప్రజలకు అండగా కాంగ్రెస్ ప్రభుత్వం పని చేస్తుంది

యువజన కాంగ్రెస్ నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్

Vemula Gopinath: కాంగ్రెస్ ప్రభుత్వం పేద ప్రజలకు అనేక సంక్షేమ పథకాలను అమలు చేయడంతో పాటు పేద ప్రజల అభివృద్ధి ధ్యేయంగా పనిచేస్తుందని తుంగతుర్తి నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి వేముల గోపీనాథ్ ఆదివారం తెలిపారు. పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని అన్నారు.

తుంగతుర్తి నియోజకవర్గం వ్యాప్తంగా ఎమ్మెల్యే మందుల సామేలు ఆధ్వర్యంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టారన్నారు. శాలిగౌరారం మండల వ్యాప్తంగా సుమారు 6506 మంది రైతులకు 54 కోట్ల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు.రైతు భరోసా, అర్హులైన పేద కుటుంబాలకు రేషన్ కార్డులను మంజూరు చేసిందన్నారు.

మహిళలకు ఉచిత బస్సు, 200 యూనిట్ వరకు ఉచిత కరెంటు, కళ్యాణ లక్ష్మి ,షాదీ ముబారక్,ఇందిరమ్మ ఇండ్లు, అసిఫ్ నగర్ కాల్వ,మాధారం నుంచి ఇటుకులపాడు వల్లాల నుంచి జాలంవారి గూడెం వరకు బిటి రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయన్నారు, గ్రామాలలోని సిసి రోడ్ల నిర్మాణం అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందన్నారు. గతంలో లేనంతగా అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వ హాయంలో పేదలకు జరుగుతుందన్నారు.

అభివృద్ధిని చూసి ఓర్వలేక ఎమ్మెల్యే మందుల సామేలపై కొంతమంది అసత్య ప్రచారాలు చేస్తున్నారన్నారు. గతంలో ఏ సంక్షేమ పథకమైన బిఆర్ఎస్ వాళ్లకి వచ్చేదని నేడు పార్టీలకతీతంగా రేషన్ కార్డులు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ అనేక సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయన్నారు.