Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Ravula Srinivas Reddy: చెత్త ట్రాక్టర్లలో డీజిల్‌ పోయించలేని స్థితికి దిగజార్చారు

–బిఆర్ఎస్ నేత రావుల శ్రీనివాస్ రెడ్డి

ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:

Ravula Srinivas Reddy: అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ట్రాన్ని కాంగ్రెస్‌ పాలకులు అధోగతి పాల్జేశారని మాజీ కౌన్సిలర్ రావుల శ్రీనివాస్ రెడ్డి విర్శించారు. ఎట్లుండే తెలంగాణ ఎట్లయ్యిందని, మీరు చెప్పిన మార్పు ఇదేనా అని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిని ప్రశ్నించారు. గ్రామ పంచాయతీల్లో చెత్తను తరలించే ట్రాక్టర్లలో డీజిల్‌ పోయించలేని దికుమాలిన స్థితికి రాష్ట్రాన్ని దిగజార్చావని ధ్వజ మెత్తారు.

పెట్రోల్‌ పంపుల్లో డీజిల్‌ను ఉద్దెరకు పోయడం లేదని, అప్పు పుడుతలే దని, సెక్రటరీలు ట్రాక్టర్‌ తాళాలను అధికారులకు అప్పగిం చే పరిస్థితికి తెచ్చావని ఆదివారం నాడు ఒక ప్రకటనలో విమర్శించారు. ఏడాదిన్నరగా నిధులు ఇవ్వకుంటే గ్రామ పాలన ఎలా సాధ్యమవుతుంది అని ప్రశ్నించారు. రేవంత్‌రెడ్డి చేతగానితనం పంచాయతీ అధికారులకు, పారిశుద్ధ్య సిబ్బందికి శాపంగా మారుతున్నదని మండిపడ్డారు.

కేసీఆర్‌ గ్రామ పంచాయతీలను దేశం గర్వించే దిశగా తీర్చిదిద్దితే, ఇప్పుడు రేవంత్‌రెడ్డి నిర్లక్ష్యం వల్ల పంచాయ తీలు కునారిల్లుతున్నాయని విమర్శించారు. పంచాయతీల సంఖ్యను 12,941కి చేర్చి, ప్రతి గ్రామపంచాయతీకి ట్రాక్టర్‌, ట్రాలీ ఉన్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణను నిలిపారని గుర్తుచేశారు. ప్రస్తుతం నిధుల్లేక గ్రామాల్లో పారిశుద్ధ్యం కుంటుపడిం దని, నెలనెలా నిధుల్లేక నిర్వహణను గాలికొదిలేయడంతో గ్రామాలు మురికి కూపాలుగా మారాయని హరీశ్‌రావు ఆవేదన వ్యక్తంచేశారు.

బీఆర్‌ఎస్‌ పాలనలో మహర్దశ:
బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఏటా వానాకాలం ప్రారంభంలోనే ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించేదని రావుల శ్రీనివాస్ రెడ్డి గుర్తుచేశారు. పల్లెప్రగతి, పట్టణ ప్రగతి కింద పారిశుద్ధ్య నిర్వహణ కార్యక్రమాలు చేపట్టామ ని తెలిపారు. పంచాయతీలకు నెల నెలా రూ.275 కోట్ల నిధులను పం చాయతీలకు విడుదల చేశామని, మొత్తంగా ఏటా రూ.3,330 కోట్లు ఇచ్చామని గుర్తుచేశారు. పట్టణాల పారిశుద్ధ్య నిర్వహణ కోసం ఏటా అదనంగా రూ.1,700 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు.

*_అంధకారంలో గ్రామాలు_
కాలిపోయిన వీధి దీపాలు మార్చ డానికి నిధుల్లేక అనేక గ్రామాలు అం ధకారంలో మగ్గుతున్నాయని బిఆర్ఎస్ నాయకులు రావుల శ్రీనివాస్ రెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. సొంత జేబు నుంచి డబ్బులు ఖర్చు చెయ్యలేక, ఆ ఆర్థిక భారాన్ని మో యలేక పంచాయతీ కార్యార్శులు మూకుమ్మడిగా సెలవులు పెట్టే దుస్థితి దాపురించిందని పేర్కొన్నారు.

ప్రతినెలా 1వ తేదీనే జీతాలు చెల్లిస్తామని గొప్పలు చెప్పుకున్న కాంగ్రెస్‌ సర్కారు ఆచరణలో మా త్రం విఫలమవుతున్నదని మండి పడ్డారు. గ్రామ పంచాయతీ ఉద్యో గులు, కార్మికులకు రెండు నెలల జీతాలు అందక నిరసన వ్యక్తంచే స్తున్నారని పేర్కొన్నారు. నిధుల విడుదలలో తీవ్ర నిర్లక్ష్యం చూపుతున్నదని విమర్శించారు ఇప్పటికై నా గ్రామ పంచాయతీ వ్యవస్థను తిరిగి గాడిన పెట్టాలని డిమాండ్‌ చేశారు.