Raghuveer Reddy:ఎన్నికల ఫలితాల్లో పక్కా పది స్థానాలపైనే
రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా పది స్థానాల పైనే విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్య ర్థి కుందూరు రఘువీర్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
ఓటేసిన ప్రజలందరికీ కృతజ్ఞతలు
నల్లగొండ ఎంపీ అభ్యర్థి కుందూరు రఘువీర్ రెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ: రాష్ట్రంలో 17 పార్లమెంట్ ఎన్నికల్లో పక్కా పది స్థానాల పైనే విజయం సాధిస్తామని నల్లగొండ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్య ర్థి కుందూరు రఘువీర్ రెడ్డి(Raghuveer Reddy)ధీమా వ్యక్తం చేశారు. మంగళవారం నల్ల గొండ లోని మంత్రి కోమటిరెడ్డి వెంక టరెడ్డి క్యాంపు కార్యాలయం లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావే శంలో మాట్లాడారు. నల్లగొండ, భువనగిరి స్థానాలలో అత్యధిక మెజార్టీతో గెలవబోతున్నామని అన్నారు. పార్లమెంట్ ఎన్నికలలో(Parliament elections)రెండవ స్థానంలో బిజెపి పార్టీ ఉం టుందన్నారు.నల్లగొండ పార్ల మెంట్ స్థానానికి జరిగిన ఎన్నికలలో 74. 02 శాతం పోలింగ్(Polling) నమోదు అయ్యిందని తెలిపారు.
ఓటేసిన ప్రతి ఒక్కరికి ఈ సందర్భంగా రఘువీర్ రెడ్డి కృతజ్ఞతలు తెలి పారు.పేద ప్రజల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) ఈ ఐదేళ్లతో పాటు మరో ఐదే ళ్లు ఆయనే సీఎంగా ఉంటారని అన్నారు.తుంగతుర్తి మాజీ ఎమ్మె ల్యే గాదరి కిషోర్ గతంలో తనపై చేసిన ఆరోపణలు చిల్లర మాట లుగా రఘువీర్ రెడ్డి అభివర్ణించా రు. ఆయన ఆరోపణలపై దమ్ముం టే చర్చకు రావాలని సూచించారు. ప్రజలలో ఆయన ఆరోపణలకు స్పందనలేదని, అతని మాటలను పట్టించుకోవడంలేదని పేర్కొన్నారు.
ఎంపీగా(MP) తాను గెలుపొందిన వెంట నే ప్రజలకు ఇచ్చిన హామీలన్నింటిని అమలు చేస్తానని స్పష్టం చేశారు. తన గెలుపు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి,ఉత్తంకుమార్ రెడ్డి, పార్లమెంట్ పరిధిలోని ఎమ్మెల్యేలు, పార్టీ ప్రజా ప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, మహిళా కాంగ్రెస్, యువజన కాంగ్రెస్, ఎన్ఎస్యుఐ నాయకులు, కార్యకర్తలు ఎంతో కృషి చేశారని అన్నారు. ఈ సంద ర్భంగా వారందరికీ కృతజ్ఞతలు తెలిపారు. పార్లమెంట్ ఎన్నికలలో తాను అత్యధిక మెజార్టీతో గెలు పొందుతానని ధీమా వ్యక్తం చేశారు. ఈ విలేకరుల సమావేశం లో నల్లగొండ(Nalgonda) పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి, నాయకులు ప్రసాద్, జూలకంటి సైదిరెడ్డి,పట్టణ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు గాలి నాగరాజు, నాయ కులు గాదరి రవి, ఎంపీటీసీ పెండెం పాండు,ఏడు దొడ్ల వెంకట్రామిరెడ్డి, దండు ఎల్లయ్య, బైరుప్రసాద్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.
Congress win Ten seats Parliament elections