–మౌలిక సదుపాయాల కోసం నిధు లు కేటాయించాలి
–లాటరీ ద్వారా ఎంపిక చేసిన లబ్ధి దారులకు వెంటనే స్వాధీనపర్చాలి
CPI: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్ల గొండ జిల్లా కేంద్రంలో డబుల్ బెడ్ రూమ్ (Double bedroom)లో విషయంలో లాటరీ ద్వా రా ఎంపిక చేసిన లబ్ధిదారులకు వెంటనే స్వాధీనపర్చాలని సిపిఎం నల్లగొండ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు సయ్యద్ హశం (Syed Hasham), పట్టణ కార్యదర్శి ఎండి సలీంలు (Town Secretary MD Salim)ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం దొడ్డి కొమురయ్య భవన్ లో ఏర్పా టుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ 2017లో రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండ పట్టణా నికి 552 ఇండ్లు నిర్మాణం చేపట్టా రని వారు తెలిపారు. డ్రైనేజీ విద్యుత్తు మంచినీటి సదుపాయం అంతర్గత రోడ్ల నిర్మాణం లేకపోవ డంతో లబ్ధిదారులను లాటరీ ద్వారా ఎంపిక చేసినప్పటికీ స్వాధీనం చేయడంలో విఫలమయిందని ఆరోపించారు 2023 ఫిబ్రవరి 22న డ్రా ద్వారా ఎంపిక చేసి నేటికీ 17 నెలలు పూర్తి అయినప్పటికీ లబ్ధిదారులకు స్వాధీనపరచడంలో గత ప్రభుత్వము మరియు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడు నెలలైనా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం సరికాదని అన్నారు .
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల (Double bedroom) నిర్మాణం అసంపూర్తిగా ఉండడం వలన ఉపయోగంలో లేక శిథిలావస్థకు చేరి ప్రజాధనం దుర్యోగం అవుతుందని, అసాంఘిక కార్యక్రమాలకు (Non-social activities) అడ్డాగా మారిందని తెలిపారు. కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే విధులు కేటాయించి మౌలిక సదుపాయాలు కల్పించా లని డిమాండ్ చేశారు. గత ప్రభు త్వం దరఖాస్తులు స్వీకరించి విచారణ చేసి అర్హత కలిగిన పేదలను గుర్తించి వారి లో నుండి లాటరీ ద్వారా లబ్ధిదారుల ను ఎంపిక చేయడం జరిగిందని తెలిపారు. అట్టి లబ్ధిదారులకు ప్రభుత్వం వెంటనే మౌలిక సదుపాయాలు (Infrastructure)కల్పించి స్వాధీన పరచాలని డిమాండ్ చేశారు. లేనియెడల లబ్ధిదారులతో కలిసి కలెక్టరేట్ ముందు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దండెంపల్లి సత్తయ్య , తుమ్మల పద్మ, పట్టణ కార్యదర్శి వర్గ సభ్యులు కుంభం కృష్ణారెడ్డి, అద్దంకి నరసింహ, సలివొజు సైదాచారి తదితరులు పాల్గొన్నారు.