–నల్లగొండ సిపిఐ బహిరంగ సభ లో సిపిఐ జాతీయ ప్రధాన కార్య దర్శి డి. రాజా
CPIPublicMeeting ప్రజా దీవెన, నల్లగొండ బ్యూరో: భారతదే శం, రాజ్యాంగం, ప్రజాస్వామ్య పరి రక్షణకు మతతత్వ ఫాసిస్టు ఆర్ -బిజెపి రాజ్ నుంచి భారతదేశాన్ని విముక్తి చేయాలని ప్రజలకు సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రా జా పిలుపునిచ్చారు. ఇందుకు దేశంలోని అన్ని ప్రజాస్వామ్య, లౌకిక, వామపక్ష శక్తులన్నీ ఐక్యంగా పోరాటం చేయాలన్నారు. భారత స్వాతంత్య్రఉద్యమంలో మహాత్మా గాంధీతో పాటు కమ్యూనిస్టు పార్టీ కూడా పోరాటం చేసిందని, అదే స్ఫూర్తితో మరోసారి బిజెపి, ఆర్ శక్తులకు వ్యతిరేకంగా లౌకిక, ప్రజా స్వామ్య శక్తులు కలిసి పోరాటం చేయాల్సిన అవసరం ఉన్నదని రాజా ఉద్ఘాటించారు.
సిపిఐ శతాబ్ది ఉత్సవాల ప్రారంభోత్సవాన్ని పుర స్కరించుకుని సోమవారం పోరా టల ఖిల్లా నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగసభను నిర్వహించారు. సిపిఐ జాతీయ సమితి సభ్యులు పల్లా వెంకట రెడ్డి అధ్యక్షతన జరిగిన బహిరంగ సభకు ముఖ్య అతిథులుగా సిపిఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా , మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధా కర రెడ్డి, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివ రావు హజర య్యారు. సిపిఐ జాతీయ కార్యద ర్శి సయ్యద్ అజీజ్ పాషా, జాతీ య కార్యవర్గ సభ్యులు చాడ వెంక ట రెడ్డి, పశ్య పద్మ, జాతీయ సమి తి సభ్యులు, కె.శ్రీనివాస్ రెడ్డి, సిపిఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి తక్కెళ్లపల్లి శ్రీనివాస రావు, కార్యదర్శి వర్గ సభ్యులు కలవేణ శంకర్, ఎం.బాలనరసింహా, ఇ.టి.నరసింహా, వి.ఎస్.బోస్ వేదికపై ఆసీనులయ్యారు.
సభలో డి.రాజా ప్రసంగిస్తూ వందేళ్ళ కొంద స్థాపించబడిన భారత కమ్యూనిస్టు పార్టీ భారత దేశానికి సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని నినదించిన మొట్టమొద టి పార్టీ అని, వలసవాదులకు వ్యతిరేకంగా రాజీలేని పోరాటం చేసిందని తెలిపారు. అదే వందేళ్ళ క్రితం ఏర్పాటైన ఆర్ భారత స్వాతంత్రోద్యమంలో, బ్రిటీష్, ఫ్రెంచ్, పోర్చుగీస్ వలసవాదులకు వ్యతిరేకంగా స్వాతంత్రోద్యమంలో పాల్గొనలేదని విమర్శించారు. బిజెపి గురువు ఆర్ అని, దాని రాజకీయ విభాగమే బిజెపి అని అన్నారు. కమ్యూనిస్టు నాయకులు స్వాతంత్య్రపూర్వమే భారతదేశ భవిష్యత్తు కోసం దేశాన్ని ముందుకు నడిపేందుకు దూరాలోచనతో రాజ్యాంగ సభ కావాలని తెలిపారు.
భారతదేశం మతపరమైన దేశం కావొద్దని, భారతదేశం లౌకిక గణ తంత్ర, ప్రజాతంత్ర దేశంగా ఫరిగడవిల్లాలని తాము నాడు కోరుకున్నామని, మతతత్వ వాదులను, మతతత్వ సంస్థలకు చెందిన సభ్యులను సిపిఐ సభ్యునిగా చేర్చుకోవద్దని నిర్ణయించిన మొట్ట మొదటి పార్టీ సిపిఐ అని రాజా చెప్పారు. రాజ్యాంగ రూపశిల్పి డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ సైతం భారతదేశాన్ని మతతత్వ దేశంగా మార్చడాన్ని తీవ్రంగా వ్యతిరేకించారని,హిందూదేశంగా మారితే భారతదేశానికి పెను విపత్తుగా పరిణమిస్తుందని హెచ్చరించారని తెలిపారు. ప్రస్తుతం రాజ్యాంగానికి, దేశానికి , ప్రజాస్వామ్యానికి బిజెపి, ఆర్ నుంచి పెనుప్రమాదం ఏర్పడిందన్నారు. వారి నుంచి దేశాన్ని పరిరక్షించడం, లౌకిక, ప్రజాస్వామ్య దేశంగా కాపాడుకోవడం పెద్ద సవాల్ మారిందన్నారు. అప్పుడు బ్రిటిష్ పోర్చుగీస్ నుంచి భారతదేశాన్ని విముక్తి చేసినట్టే, మతతత్వ, ఫాసిస్టులు, విభజన శక్తులైన బిజెపి, ఆర్ పారదోలే లక్షంగా చేసుకుని పనిచేయాల్సిన చారిత్రక కర్తవ్యం కమ్యూనిస్టలపై ఉందన్నారు.
అంబేడ్కర్ తిడితే అమిత్ షా దేశంలో తిరగలేడు
కేంద్రం హోం శాఖ మంత్రి అమిత్ రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ ఇలాగే తిడితే భారతదేశంలో తిరిగే పరిస్థితి ఉండబోదని, ప్రజలు తిరగబడుతారని , పోరాటం చేస్తారని రాజా హెచ్చరించారు. అమిత్ షా తక్షణమే క్షమాపణ చెప్పి, తన మంత్రి పదవికి రాజీనామా చేయాలని , ఆయన తన మంత్రి పదవికి రాజీనామా చేయకపోతే ప్రధాని మోదీ హోంశాఖ మంత్రి పదవి నుంచి అమిత్ షాను తొలగించాలని డిమాండ్ చేశారు. అమిత్ హోం మంత్రిగా ఉండేందుకు ఏ మాత్రం వీలు లేదని స్పష్టం చేశారు. విద్యా, ఉపాధి కల్పన, గృహవసతి, విద్యాహక్కు, ప్రాథమిక హక్కులు ఉండాలని రాజ్యాంగం చెబుతుందని, పౌరులు గౌరవంగా ఉండాలని, రోడ్లపైన ఎవ్వరూ అడుకోవద్దని, తిండిలేకుండా ఉండకూడదని రాజ్యాంగంలో పొందపర్చిన విషయాన్ని రాజా వివరించారు. ప్రజలకు స్వేచ్ఛ, సమానత్వం, న్యాయం ఉండాలని రాజ్యాంగం చెబుతుందని, కానీ 75 సంవత్సరాల రాజ్యాంగ వార్షికోత్సవాలు జరుపుకుంటున్నప్పటికీ పేదలకు, సామాన్యులకు సమానత్వం , సౌభ్రాతృత్వం ఎక్కడ ఉన్నదని, ఎక్కడ న్యాయం అందుతుందని ప్రశ్నించారు. ఇప్పటికీ క్రిస్టియన్లు, ముస్లింపైన దాడులు జరుగుతున్నాయని, దళితులు, ఆదివాసీలపైన అత్యాచారాలు జరుగుతున్నాయని విమర్శించారు. భారతదేశంలో ప్రస్తుతం దళిత,గిరిజన మహిళలకు, పిల్లలకు భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు.
అదానీ, అంబానీలను రక్షిస్తున్న మోదీ, బిజెపి అదానీ,అంబానీలను ప్రధాని మోదీ, బిజెపి రక్షిస్తోందని రాజా విమర్శించారు. అదానీ ప్రపంచ వ్యాపార వేత్తల్లోనే బిలినియర్ మారారని, ఆయనపై అమెరికా దేశంలో చార్జీషీట్ దాఖలు చేసినా, ఆయనపై చర్చకు, చర్యకు మోదీ అంగీకరించడం లేదని, ఆయనను కాపాడేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.పేదలు, కార్మిక, రైతులకు మోదీ, బిజెపి ప్రభుత్వం వ్యతిరేకమని, అదానీ, అంబానీ లాంటి ఆశ్రిత పెట్టుబడిదారులకు వారు అనుకూలమని, అందుకే దేశంలో ఆర్థిక అసమానతలు నెలకొన్నాయని అన్నారు. దేశంలో పిల్లలు,మహిళలు రక్తహీనతతో బాదపడుతున్నట్టు సాక్షాత్తు ప్రభుత్వ లెక్కలే చెబుతున్నాయని రాజా అన్నారు. ప్రధాని మోదీ ఒక వైపు వికసిత్ భారత్ అని చెబుతున్నారని, మరోవైపు పెరిగి న ధరలతో ప్రజలు బాధపడుతున్నారని, వికసిత్ భారత్ ఎక్కడ ఉన్నదని రాజా కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు.
ప్రతి పల్లె, పట్టణాల్లో ఎర్ర జెండా ఎగరాలె: రాజా
భారతదేశంలో అంటరానితనానికి వ్యతిరేకంగా కుల, వర్గ రహిత నూతన సమాజం కోసం, సోసలిస్టు భారతదేశం కోసం పోరాటం చేయాలని, అదే మన ముందు ఉన్న లక్షం అని రాజా సూచించారు. శతాబ్ధి ఉత్సవవాల్లో భాగంగా తెలంగాణ రాష్ట్రంలో ఎర్రజెండా లేని పల్లెలు, పట్టణాలు ఉండరాదని, ప్రతి గ్రామ, మున్సిపాలిటీల్లో కమ్యూనిస్టు పార్టీ బలంగా ఎదగాలని, ఆ దిశగా కమ్యూనిస్టు ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. భారతదేశాన్ని బిజెపి, ఆర్ ప్రజా వ్యతిరేక పోరాటం నుంచి విముక్తి కలిపించేందుకు ఎర్ర జెండా ముందుండి పోరాడాలని, సిపిఐని మరింత బలోపేతం చేయాల్సిన సమయం ఆసనన్న మైందని రాజా సూచించారు. ఎర్ర జెండా మరింత ఉన్నతగా ఎదగాలని, పట్టణాలు, గ్రామాలకు చేరాలన్నారు.
నాటి బ్రిటీష్ పాలకులు భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించకుండా మొగ్గలోనే తుంచేసేందుకు మీరట్, లాహోర్, కాన్పూర్ కుట్ర కేసులను మోపారని,వాటిని ఎదుర్కొని కమ్యూనిస్టు విప్లవకారులు భారత కమ్యూనిస్టు పార్టీని ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వారి విప్లవ వారసత్వాన్ని ముందుకు తీసుకెళ్తున్నందుకు మనకెంతో గర్వకారణమన్నారు. వందేళ్ల క్రితం ఏర్పడిన భారత కమ్యూనిస్టు పార్టీ నాడు భారత దేశ స్వాతంత్య్రం, బ్రిటీష్, పోర్చుగీస్, ఫ్రెంచ్ వలసపాలకుల నుంచి ప్రజలకు విముక్తి కోసం పోరాటం చేసిందన్నారు. అలాగే తెలంగాణలో నిజాం రాజచరిక, భూస్వామ్య వ్యవస్థ వ్యతిరేకంగా చారిత్రక సాయుధ పోరాటానికి నాయకత్వం వహించిందని గుర్తు చేశారు.
సభకు సిపిఐ నల్లగొండ జిల్లా కార్యదర్శి నెల్లికంటి సత్యం స్వాగతం పలకగా, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు బొమ్మగాని ప్రభాకర్, గన్నా చంద్రశేఖర్, పల్లా నరసింహారెడ్డి,సీనియర్ నాయకులు ఉజ్జని రత్నాకర్ మల్లేపల్లి ఆదిరెడ్డి , మాజీ ఎంఎల్ ఉజ్జని యాదగిరి రావు, సిపిఐ యాద్రాది భువనగిరి జిల్లా కార్యదర్శి గోదా శ్రీరాములు, సూర్యాపేట జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య, హైదరాబాద్ జిల్లా ఎస్.ఛాయాదేవితో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కార్యదర్శులు, ప్రజా సంఘాల అధ్యక్ష, కార్యదర్శులు వేదికపై ఆశీనులైయ్యారు.