Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nalgonda Parliament: సీపీఎం ఎంపీ అభ్యర్థి జహంగీర్ ని గెలిపించాలి

పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని సీపీఐ(ఎం) భువనగిరి నియోజకవ ర్గం అభ్యర్థి జహంగీర్ గెలిపిం చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీ నారాయ ణ, జిల్లా కమిటీ సభ్యులు దండెంప ల్లి సత్తయ్య లు అన్నారు.

ప్రజా దీవెన, కట్టంగూర్: పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలను ఓడించాలని సీపీఐ(ఎం) భువనగిరి నియోజకవ ర్గం అభ్యర్థి జహంగీర్ గెలిపిం చాలని సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చినపాక లక్ష్మీ నారాయ ణ, జిల్లా కమిటీ సభ్యులు దండెంప ల్లి సత్తయ్య లు అన్నారు. మంగళ వారం రోజున కట్టంగూర్ మండలం ముత్యాలమ్మ గూడెం గ్రామంలో ఇంటింటా జహంగీర్ ను గెలిపిం చాలని ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వామపక్షాల బలాన్ని పెంచాలని, కేంద్రంలో ప్రత్యామ్నాయ లౌకికవాద ప్రభుత్వం ఏర్పడేలా చూడాలని సీపీఐ(ఎం) పిలుపునిచ్చిందని,
కేంద్రంలో మోడీ నేతృత్వంలోని బీజేపీ ప్రభుత్వం దశాబ్ద కాలంగా సాగించిన పాలనతో లౌకికవాద, ప్రజాస్వామ్య, భారత రిప

బ్లిక్‌ ఉనికే ప్రమాదంలో పడిన నేపథ్యంలో 2024 లోక్‌సభ ఎన్నికలు జరుగు తున్నాయని, రాజ్యాంగానికి నాలు గు మూల స్తంభాలుగా భావించే లౌకికవాద ప్రజాస్వామ్యం, ఆర్థిక సార్వభౌమత్వం, సమాఖ్యవాదం, సామాజిక న్యాయం వ్యవస్థలను ఒక పద్ధతి ప్రకారం ధ్వంసం చేసే క్రమాన్ని నేడు భారతదేశం తిప్పి కొట్టాలని, ప్రభు త్వ యంత్రాంగాన్ని, పార్ల మెంట్‌లో తనకున్న మెజా రిటీని దుర్వి నియోగం చేస్తూ, నిరంకు శవాద, మతోన్మాద మోడీ ప్రభుత్వం దేశంలోని కార్మికుల హక్కులను నాశనం చేసేందుకు ఫాసిస్ట్‌ పద్దతులను ఉపయోగిస్తూ భారతదేశాన్ని ప్రపంచంలో కెల్లా అత్యంత అసమానతలు కలిగిన సమాజాల్లో ఒకటిగా మారుస్తోం దని, మరోపక్క ప్రజలను మత పరంగా విభజించేందుకు విష పూరితమైన తన మతోన్మాద సిద్ధాంతాలను ప్రయోగిస్తోందని, ఆ ప్రయత్నాలకు వ్యతిరేకంగా భారతదేశాన్ని కాపాడేలా ఈ లోక్‌సభ ఎన్నికలు జరుగుతున్నా యన్నారు.

ఈ ఎన్నికలను ఉపయోగిం చుకొని బీజేపీని, దాని మిత్రపక్షాలను ఓడించడమే ప్రతి దేశభక్తుని కర్తవ్యంగా భావించాలని, ప్రతీ కార్యకర్త ప్రజలకు అందుబా టులో ఉంటూ మన సిపియం విధానాలను ప్రజలవద్దకు తీసుకెళ్ళి మన అభ్యర్థి కామ్రేడ్ యండి జహాంగీర్ ను అధిక మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ ప్రచార కార్యక్రమం లో మండల కార్యదర్శి పెంజర్ల సైదులు, ముత్యాలమ్మ గూడెం మాజీ సర్పంచ్ వనం అంజయ్య, ఉడుగుండ్ల రామకృష్ణ, ముసుకు రవీందర్, చెరుకు అంజయ్య సిపిఎం సభ్యులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

CPIM win in Nalgonda parliament