Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DCCB: నెగ్గిన డిసిసిబి అవిశ్వాస తీర్మానం

–బీఆర్ఎస్ పార్టీకి చెందిన గొంగిడి మహేందర్ రెడ్డిపై అవిశ్వాసం
–డిసిఓ కు అవిశ్వాస తీర్మానమిచ్చి న 14 మంది డైరెక్టర్లు
–త్వరలోనే నూతన చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి

DCCB: ప్రజా దీవెన, నల్లగొండ: ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీబీ (DCCB) చైర్మన్ గొంగిడి మహేందర్ రెడ్డిపై (Mahender Reddy) డైరెక్టర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. బీఆర్ఎస్ పార్టీకి (BRS party) చెందిన గొంగిడి మహేందర్ రెడ్డిని చైర్మన్ పదవి నుంచి తొలగించాలని కోరుతూ 14 మంది డైరెక్టర్లు కొద్దిరోజుల క్రితం డీసీఓ కిరణ్ కుమార్ (DCO Kiran Kumar)కు అవిశ్వాస తీర్మానాన్ని ఇచ్చారు.

డైరెక్టర్లు ఇచ్చి న అవిశ్వాస తీర్మానం మేరకు శుక్ర వారం ఉదయం 11 గంటలకు నల్ల గొండ డీసీసీబీ కార్యాలయంలో అవి శ్వాస తీర్మానంపై ఓటింగ్ నిర్వ హించగా 15మంది డైరెక్టర్లు మహేం దర్ రెడ్డికి (Mahender Reddy) వ్యతిరేకంగా ఓటు వేశా రు. దీంతో మహేందర్ రెడ్డి పదవి కోల్పోయారు. ఇదిలా ఉండగా నూతన చైర్మన్ ఎంపిక కోసం త్వర లో ఓటింగ్ నిర్వహించనున్నట్లు డీసీఓ తెలిపారు. అయితే నూతన చైర్మన్ గా శ్రీనివాస్ రెడ్డి ఎన్నిక కానున్నారు. మహేందర్ రెడ్డి పై అవిశ్వాసం తరువాత కాంగ్రెస్ పార్టీలో చర్చలు అనంతరం శ్రీనివాస్ రెడ్డికి పదవి బాధ్యతలు అప్పగించాలని కోమటిరెడ్డి బ్రదర్స్ నిశ్చయించినట్లు తెలిసింది. ఆ మేరకు నల్లగొండ జిల్లా నూతన డీసీసీబీ చైర్మన్ గా కాంగ్రెస్ పార్టీకి చెందిన శ్రీనివాస్ రెడ్డి నియామకం కానున్నారు.