MLC Elections: వికలాంగ పట్టభద్రుల ఓట్లు తీన్మార్ మల్లన్నకే
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 వేల వికలాంగ పట్టభద్రల ఓట్లు కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకేనని వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు.
బీఆర్ఎస్, బిజెపి పార్టీలకు విక లాంగుల ఓట్లు అడిగే హక్కు లేదు
వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ముత్తినేని వీరయ్య
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఉన్న 12 వేల వికలాంగ పట్టభద్రల ఓట్లు(Disabled graduates Votes) కాంగ్రె స్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్న(Tinmar Mallanna)కేనని వికలాంగుల సంక్షేమ శాఖ స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం రాష్ట్ర చైర్మన్ ముత్తినేని వీరయ్య అన్నారు. బుధవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి క్యాంపు కార్యాలయంలో జరిగిన జిల్లా వికలాంగ పట్టభద్రుల(Disabled graduates)ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ వికలాంగ పట్టభద్రులంతా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని అన్నారు.
అన్ని వికలాంగ సంఘాల సంపూర్ణ మద్దతు మల్లన్నకేనని ప్రకటించారు.వికలాంగుల సంక్షేమ శాఖని,కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడమే కాకుండా విద్యలో, ఉద్యోగంలో రిజర్వేషన్ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీనేని స్పష్టం చేశారు. వికలాంగులకు ఆర్థిక సహకారం, హక్కులు, సంరక్షణ, జీవన భద్రత, మెరుగైన విద్య,వికలాంగులకు రిజర్వేషన్లు కల్పించి ఉద్యోగాలు పొందేలా.. ఇలా ఎన్నో చట్టాలను కాంగ్రెస్ పార్టీ చేసిందని అన్నారు. గత పది ఏళ్లుగా బీఆర్ఎస్(BRS) పాలనలో వికలాంగుల ఉద్యోగాలతో పాటు ఎలాంటి బ్యాక్ లాగ్ పోస్టులను భర్తీ చేయలేదని విమర్శించారు. 9 వికలాంగుల జాతీయ సంస్థలలో ఒక్క ఉద్యోగం కూడా గడిచిన 10 ఏళ్లలో భర్తీ చేయలేదని ఆరోపించారు.
వికలాంగ బ్యాక్ లాగ్ ఉద్యోగాలు(Handicapped backlog jobs) భర్తీ చేయకపోవడంతో సాగర్ రింగ్ రోడ్డు హోమ్ హాస్టల్లో ఉంటున్న నల్లగొండ జిల్లా నిరుద్యోగ వికలాంగుడు బొమ్మకంటి మహేందర్, హనుమకొండ హోమ్ హాస్టల్లో ఉంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా నిరుద్యోగ వికలాంగుడు రాగుల రామ్మోహన్ ఆత్మహత్య చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి కుటుంబంలో ఒకరికి ఉద్యోగం,రూ.10 లక్షల పరిహారం ఇస్తామని గత బిఆర్ఎస్ ప్రభుత్వం హామీ ఇచ్చి మోసం చేసిందని ధ్వజమెత్తారు.
వికలాంగులను అన్ని విధాలుగా మోసం చేసిన బీజేపీ(BJP),బీఆర్ఎస్ పార్టీలను నల్లగొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలలో చిత్తుగా ఓడించాలని పిలుపునిచ్చారు.ఈ విలేకరుల సమావేశంలో నల్గొండ మార్కెట్ కమిటీ జూకూరి రమేష్, కాంగ్రెస్ పార్టీ వికలాంగుల విభాగం జిల్లా అధ్యక్షుడు షేక్ లతీఫ్, వర్కింగ్ ప్రెసిడెంట్ పల్సా రవి, విహెచ్పిపిఎస్ అధ్యక్షుడు కొత్త వెంకన్న యాదవ్, సి.హెచ్ మత్స్యగిరి, వి.ముత్తయ్య, డి. శంకర్, ఎం.నాగరాజు, మాధవరెడ్డి,మధు, డి.సైదులు, సైదిరెడ్డి,బుచ్చి రాములు ,ఎం. నగేష్ పాల్గొన్నారు.
Disabled graduates Votes Tinmar Mallanna