Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

fake schemes: నకిలీ స్కీం లలో చేరకండి

మోస:పూరితమైన నకిలీ స్కీంలలో లక్షల్లో పెట్టుబడులు పెడితే డబల్ గిట్టుబాటులు అంటూ చైన్ లింక్ స్కీమ్ లతో పెట్టుబడులు పెట్టి మోసపోతున్న కేసులు నమోదవు తున్నాయని జిల్లా ఎస్పి చందనా దీప్తి తెలిపారు.

లక్షల్లో పెట్టుబడి డబల్ రెట్లతో గిట్టుబాటు, అంటూ చైన్ లింక్ స్కీమ్ (Chain link scheme) మోసాలతో సైబర్ నేరగాళ్లు
సోషల్ మీడియా వేదికగా ఉద్యో గాల పేరిట నిరుద్యోగులకు వల
నల్లగొండ జిల్లా ఎస్పి చందనా దీప్తి
ప్రజా దీవెన, నల్లగొండ క్రైమ్: మోసపూరితమైన నకిలీ స్కీంలలో లక్షల్లో పెట్టుబడులు పెడితే డబల్ గిట్టుబాటులు అంటూ చైన్ లింక్ స్కీమ్ లతో పెట్టుబడులు పెట్టి మోసపోతున్న కేసులు నమోదవు తున్నాయని జిల్లా ఎస్పి చందనా దీప్తి తెలిపారు. మంగళవారం ఆమె ఒక ప్రకటన విడుదల చేస్తూ ఇలాంటి స్కీమ్ లతో ఒకరి తరువాత ఒకరు చైన్ లింకులతో (Chain link scheme) పెట్టుబడులు పెట్టిన తరువాత మొదటగా కొంత ఇస్తూ ఆశ చూపించి అధిక మొత్తంలో పెట్టుబడులు పెట్టిన తరువాత అడ్రెస్స్ లేకుండా మాయం అయినా తరువాత మోసపోయినామని వస్తున్న కేసులు చాలా వస్తున్నాయని అన్నారు.

ఇలాంటి స్కీమ్ లలో చేరి మోసపవద్దని తెలిపారు. సోషల్ మీడియా వాట్సాప్ ల ద్వారా నిరుద్యోగులను ఆసరా చేసుకుని నకిలీ ఉద్యోగాల పేరిట డబ్బులు వసూళ్లు చేస్తూ మోసం చేస్తున్న కేసులు నమోద య్యాయని, ఉద్యోగాల పేరిట ఎలాంటి మెసేజ్ వచ్చిన అలాంటి వాటికి స్పందించి మోసపోవద్దని అన్నారు. సోషల్ మీడియాలో వచ్చే లింకులను క్లిక్ చేస్తే మీ యొక్క డేటా (data) మొత్తం తమ అదీనంలోకి తీసుకొని మీ యొక్క బ్యాంక్ అకౌంట్ లోని అమౌంట్ ను లూటీ చేస్తారు. కాబట్టి సోషల్ మీడియాలో వచ్చే లింకులను క్లిక్ చేసి మోసపోవద్దని అన్నారు.

Do not join fake schemes