Donation: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని 39 వార్డు గాంధీనగర్ లో ముత్యాలమ్మ దేవాలయానికి కాంగ్రెస్ పార్టీ జిల్లా యువనేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy)వీరాభిమాని పల్లా రవితేజ రూ.25,116 విరాళాన్ని (Donation) అందజేశారు.ఆదివారం దేవాల యంలో దేవాలయ కమిటీ నిర్వా హకులకు విరాళాన్ని అందజేసి దేవాలయ అభివృద్ధికి ఎల్లవేళలా తన సహకారం ఉంటుందని పేర్కొ న్నారు.
గాంధీనగర్ లోని ముత్యా లమ్మ గుడికి (Mutyalamma temple)వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా అన్ని వసతులు ఏర్పాటు చేయాలని కోరారు. భక్తుల కోరికలను తీర్చే కొంగుబంగారంగా ఈ దేవాలయం మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. అదేవిధంగా దేవాలయ అభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములై అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరా రు. ఈ కార్యక్రమంలో పలువురు కాంగ్రెస్ పార్టీ నాయకులు,స్థానిక కాలనీవాసులు పాల్గొన్నారు.