Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP K Sivaram Reddy: ప్రతి కాలనీ సురక్షితంగా తీర్చిదిద్దుటకు సీసీ కెమెరాలు దోహదపడుతాయి

ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : 22 వార్డులో స్థానిక కౌన్సిలర్ మరియు కాలనీవాసులు మున్సిపల్ చైర్మన్ సహకారంతో ఏర్పాటు చేసిన 29 కెమెరాల ప్రారంభోత్సవ కార్యక్రమం,నల్లగొండ జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, నల్లగొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ రెడ్డి సూచనల మేరకు 22 వ వార్డు కౌన్సిలర్ సయ్యద్ మరియు స్థానికులు మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి సహకారంతో ఏర్పాటు చేసిన కెమెరాలను నల్లగొండ డీఎస్పీ కె శివరాం రెడ్డి ప్రారంభించడం జరిగింది. ఈ సందర్భంగా డీఎస్పీ శివరాం రెడ్డి మాట్లాడుతూ, నేర రహిత పట్టణం గా తీర్చిదిద్దాలనే లక్ష్యం తో ప్రతి కాలనీ లో సీసీటీవీ కెమెరా లను ఏర్పాటు చేసుకోవాలని, దీనికి ప్రతి ఒక్క కాలనీ పెద్దలు, ప్రజాప్రతినిధులు, వ్యాపారస్తులు, కాలనీ వాసులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి కాలనీ లో ప్రతి ఎంట్రీ మరియు ఎక్సిట్ ప్రదేశాలలో, ముఖ్య కూడలిలో ఏర్పాటు చేసుకోవాలని, అలాగే ఒక్క సీసీ కెమెరా 100 పోలీస్ సిబ్బంది తో సమానం అని, అన్ని కేసులలో ముఖ్య సాక్ష్యంగా తీసుకోబడుతుంది అని తెలియ జేయడం జరిగింది.ప్రతి కాలనీ ని సురక్షిత కాలనీ గా ఏర్పాటు చేసుకోవడం ద్వారా కాలనీ లో దొంగతనాలు/నేరాలు, న్యూసెన్స్ పూర్తిగా తగ్గిపోతాయని తెలిపారు.

నేను సైతం అనే కార్యక్రమం ద్వారా ప్రతి అపార్ట్మెంట్లలో, షాప్స్ లలో, ఇండివిజల్ హౌసెస్ లలో కెమెరాలను ఏర్పాటు చేసుకొని ఎప్పటికప్పుడు ఫోన్లలో సమాచారం తెలుసుకునే విధంగా అనేక రకాల టెక్నాలజీస్ అందుబాటులో ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని నేరాలను అరికట్టవచ్చు అని తెలియజేశారు. సూచించారుఅలాగే పోలీస్ సూచన మేరకు సీసీటీవీ కెమేరాలను ఏర్పాటు చేసిన మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, కౌన్సిలర్ సమద్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గుమ్మల మోహన్ రెడ్డి, ఎస్ఐ సందీప్, పోలీస్ సిబ్బంది మహమూద్, గాంధీ, కృష్ణ, శ్రీను కాలనీ వాసులు పాల్గొన్నారు.