Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP K. Sivaram Reddy: రాజీ మార్గమే రాజ మార్గం డి. ఎస్. పి కె.శివరాం రెడ్డి

ప్రజాదీవెన, నల్గొండ టౌన్ :నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో డిసెంబర్ 14 న నిర్వహించబోయే మెగా లోక్ అదాలత్ సంధర్బంగా రాజీపడదగిన కేసులలో ఉన్న కక్షిదారులతో సమావేశం.డిసెంబర్ 14న జరగబోయే మెగా లోక్ అదాలత్ సందర్భంగా, నల్గొండ జిల్లా యస్.పి శరత్ చంద్ర పవార్ ఆదేశానుసారం, నల్గొండ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో రాజీపడదగిన (కాంపౌడబుల్ కేసులు) కేసులలో కక్షిదారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో నల్గొండ డి.యస్.పి కె శివరాం రెడ్డి మాట్లాడుతూ, క్షణికావేశంలో, విచక్షణ కోల్పోయి, ఆవివేకంతో పట్టింపులకి పోయి కేసులు నమోదు చేసుకుని పంథాలకి పోకుండా రాజీ పడే కేసులలో కక్షిదారులు రాజీ పడి అన్నదమ్ముల్లా మెలగాలని, రాజీ మార్గమే రాజమార్గం అని, ప్రతి ఒక్క కక్షీ దారుడు జాతీయ మెగా లోక్ అదాలత్ ద్వారా వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

అనంతరం నల్గొండ వన్ టౌన్ ఇన్స్పెక్టర్ ఏ రాజాశేఖర్ రెడ్డి మాట్లాడుతూ నల్గొండ పట్టణంలో ఈ పెట్టి కేసులో, డ్రంకెన్ డ్రైవ్ లలో పట్టుబడిన వారు ఈ లోక్ అదాలత్ ని సద్వినియోగం చేసుకుని వారిపై నమోదైన కేసులని క్లియర్ చేసుకోని, వారికి సంబందించి పోలీస్ స్టేషన్ లో ఉన్న డాక్యుమెంట్స్ మరియు వస్తువులని తీసుకుని వెళ్ళమని సూచించారు. ఈ సమావేశంలో ఎస్. ఐ. లు సందీప్ రెడ్డి,సురేష్, సైదులు కౌన్సిలర్స్ ఆమిర్, బాబా సిబ్బంది శివరామ కృష్ణ, ఫరూక్, సైదులు, కృష్ణ నాయక్ మరియు కక్షిదారులు పాల్గొన్నారు.