Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

DSP Sivaram Reddy: కేసులకు సత్వర పరిష్కారం

— నల్గొండ డీఎస్పీ శివరాం రెడ్డి
ప్రజా దీవెన, శాలిగౌరారం: పోలీస్ స్టేషన్ పరిధిలోని కేసులు త్వరితగ తిన పరిష్కరించాలని నల్లగొండ డీఎస్పీ శివరాం రెడ్డి అన్నారు. నల్గొండ జిల్లా శాలిగౌరారం పోలీస్ స్టేషన్ ను శుక్రవారం DSP శివరాం రెడ్డి ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీస్ స్టేషన్ లోని రికార్డులను,ఫైల్స్ ను,పరిసరాలను పరిశీలించారు.

అనంతరం అయన పోలీస్ సిబ్బంది తో మాట్లాడుతూ పోలీసులు ప్రజల తో మమేకమై పనిచేయాలన్నారు.స్టేషన్ కు వచ్చిన పిర్యాదుదారుల తో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. కేసులు త్వరితగతిన పరిష్కరించాలని, ఇసుక అక్రమ రవాణా కాకుండా చూడాలని ఇతర చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగకుండా అరికట్టాలని చెప్పారు.అంతకు ముందు పోలీసుల గౌరవవందనాన్ని స్వీకరించారు.ఈ కార్యక్రమం లో శాలిగౌరారం సీఐ కొండల్ రెడ్డి, ఎస్ ఐ సైదులు, స్టేషన్ సిబ్బంది ఉన్నారు.