Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Nominations: ఐదవ రోజు.. ఎనిమిది మంది అభ్యర్థుల నామినేషన్లు

లోకసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 5 వ రోజైన మంగళవారం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 8 మంది అభ్యర్థులు 9 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు.

ప్రజా దీవెన నల్లగొండ:  లోకసభ ఎన్నికల నామినేషన్ల ప్రక్రియలో భాగంగా 5 వ రోజైన మంగళవారం నల్గొండ పార్లమెంట్ నియోజకవర్గానికి మొత్తం 8 మంది అభ్యర్థులు 9 సెట్ల నామినేషన్లను దాఖలు చేశారు. వీరిలో ఇద్దరు రాజకీయ పార్టీ అభ్యర్డులు కాగా, మిగిలిన ఆరుగురు స్వతంత్ర అభ్యర్థులు.

బి ఆర్ ఎస్ పార్టీ తరఫున కంచర్ల కృష్ణారెడ్డి 2 సెట్లు నామినేషన్ దాఖలు చేయగా,ఎస్ జె పి( సోషల్ జస్టిస్ పార్టీ ఆఫ్ ఇండియా) తరపున సుంకర లింగయ్య ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. స్వతంత్ర అభ్యర్థులుగా అఖిల్ సంపంగి 1 సెట్, రేళ్ళ పెద్ద నరసింహారావు 1 సెట్, సుంకరి రమేష్ 1 సెట్, అబ్దుల్ మాలిక్ 1 సెట్, కిన్నెర యాదయ్య 1 సెట్, పోలిశెట్టి వెంకటేశ్వర్లు 1 సెట్ నామినేషన్లు దాఖలు చేశారు.స్వతంత్ర అభ్యర్థుల్లో కిన్నెర యాదయ్య ఈ నెల 19న ఒక సెట్ నామినేషన్ దాఖలు చేసి, తిరిగి ఈరోజు మరో సెట్ నామినేషన్ దాఖలు చేశారు.నల్గొండ లోకసభ నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి దాసరి హరిచందన నామినేషన్లను స్వీకరించారు.

Eight candidates Nominations in Nalgonda