Polling details: పోలింగ్ వివరాలు సక్రమంగా ఇవ్వాలి
పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇచ్చే పోలింగ్ శాతం వివరాలు సరైన విధంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన పిఒ,ఏపివోలను ఆదేశించారు.
ప్రజా దీవెన నిడమనూరు: పార్లమెంట్ ఎన్నికల(Parliament elections) సందర్భంగా పోలింగ్ రోజున ప్రతి రెండు గంటలకు ఒకసారి ఇచ్చే పోలింగ్(Polling) శాతం వివరాలు సరైన విధంగా ఇవ్వాలని జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి దాసరి చందన పిఒ,ఏపివోలను ఆదేశించారు.శుక్రవారం ఆమె నాగార్జునసాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని నిడమనూరులోని తెలంగాణ ప్రభుత్వ ఆదర్శ పాఠశాల, జూనియర్ కళాశాలలో పార్లమెంటు ఎన్నికల సందర్భంగా పివో, ఏపీవోలకు ఇస్తున్న రెండవ విడత శిక్షణ కార్యక్రమాన్ని తనిఖీ చేశారు.
పోలింగ్ సందర్భంగా వినియోగించే స్టాట్యూటరీ, నాన్ స్టాచ్యుటరీ సామాగ్రి గురించి, బ్యాలెట్ యూనిట్, కంట్రోల్ యూనిట్, మాక్ పోలింగ్ , క్యూలైన్లో పెద్దగా ఉన్నప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఇతర అంశాలను జిల్లా కలెక్టర్ శిక్షణ హాజరైన పిఓ, ఏపి ఓలతో అడిగి తెలుసుకున్నారు. పోలింగ్ రోజున ప్రతి రెండు గంట లకు ఒకసారి ఇచ్చే పోలింగ్ శాతం వివరాలు సరైన విదంగా ఇవ్వా లని,తప్పులు లేకుండా పూర్తి గా,జాగ్రత్తగా పరిశీలించుకున్న తర్వాతే పోలింగ్(Polling) శాతం వివరాలు సమర్పించాలని తెలిపారు. అంతేకాక పోలింగ్ కేంద్రంలో పి ఓ,ఏపీవోలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని అన్నారు.Vఈ సంద ర్భంగా జిల్లా కలెక్టర్ స్టాచ్యుటరీ కవర్లలో ఉండే విషయాలు, అను కోకుండా బి యు,సి యు లు పని చేయనట్లైతే తక్షణమే తీసుకోవా ల్సిన చర్యలు, క్యూలైన్ పెద్దగా ఉన్నప్పుడు పోలింగ్ సమయం ముగిసిన తర్వాత చేయవలసిన విధులు తదితరు అంశాలపై సూచనలను ఇచ్చారు.
అనంతరం ఇక్కడే ఏర్పాటు చేసిన ఓటరు ఫెసిలిటేషన్ కేంద్రాన్ని తనిఖీ చేశారు. అక్కడున్న సిబ్బందితో జిల్లా కలెక్టర్ మాట్లాడు తూ అప్పటివరకు ఓటు హక్కు వినియోగించుకున్న ఉద్యోగుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక అప్పుడే ఓటరు ఫెసిలిటేషన్(Voter Facilitation) కేంద్రంలో ఓటు వేసేందుకు వచ్చిన ఉద్యోగి తన ఓటు హక్కును వినియోగించుకునే ప్రక్రియను పరిశీలించారు.
అనంతరం జిల్లా కలెక్టర్ ప్రధాన రహదారిపై హాలియా జంక్షన్ 14 వ మైలు రాయి వద్ద ఏర్పాటు చేసిన పులిమామిడి స్టాటిస్టికల్ సర్వే లెన్స్ టీం చెక్ పోస్ట్ ను తనిఖీ చేసి అక్కడున్న ఇంచార్జ్, అలాగే పోలీస్ సిబ్బందితో తని ఖీలు ఎలా నిర్వహిస్తున్నది, రిజిస్టర్లు ఎలా నిర్వహిస్తున్నది అడిగి తెలుసుకున్నారు .అన్ని వాహనాలను తనిఖీ చేయాలని ,ఏ ఒక్కటి వదిలిపెట్టకూడదని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ సూచిం చారు .జిల్లా కలెక్టర్ వెంట రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
Elections Polling details given properly