Fatima Sheikh : ప్రజా దీవెన నల్లగొండ టౌన్: ప్రజా దీవెన దేశంలో మహిళా విద్య కోసం కృషి చేసిన మొదటి తరానికి చెందిన వారిలో ఫాతిమా షేక్ ఒకరని బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి జాజుల లింగంగౌడ్ అన్నారు.ఆమె 194వ జయంతి సందర్భంగా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఆమె చిత్ర పటానికి పూల మాలలు వేసి ఘనంగా నివాళుర్పించారు.ఈ సందర్భంగా ప్రిన్సిపల్ రేపాల శ్రీనివాస్ మాట్లా డుతు సోదరుని సహాయంతో ఫాతిమా విద్యను అభ్యసించి అణగారిన వర్గాల విద్య కోసం విశేష కృషి చేశారన్నారు.జాజుల మాట్లాడుతు వివక్షతకు, అన్యా యానికి అణిచివేతకు గురైన
అన్ని వర్గాల కోసం పాటుపడ్డారని అన్నారు.మతచాందసవాధులు ఎన్ని అడ్డంకులు సృచ్టించిన ఆమె పాఠాలు చెప్పేందుకు బయలుదేరే మార్గ మధ్యంలో ఆమెపై పేడ నీళ్లు కుమ్మరించి,దుమ్ము,రాళ్ళు విసిరినా ఆమె అధైర్య పడకుండా ఒక లక్ష్యం కోసం పనిచేశారన్నారు.ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు బంటు వెంకటేశ్వర్లు,దోనేటి శేఖర్,సతీష్,కట్టా అరుణ, సత్యనారాయణ రెడ్డి,సంద్యరాణి, మాధవి ,జ్యోత్స్న ,జడ శ్రీనివాస్ శ్రీదేవి స్రవంతి కీర్తి సంజన అనిత గాయత్రి విజ్ఞత రేణుక వెన్నెల అఖిల నరేష్ వెంకన్న తదితరులు పాల్గొన్నారు.