Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

పోలీసు కుటుంబాలకు ఆర్ధిక భరోసా

నల్లగొండ జిల్లాపోలీసు కార్యాల యంలోని ఏ.ఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ గుండె పోటుతో మరణించిన యల్లారెడ్డి సతీమణి దివ్యకు భద్రతా పార్ట్ ఫైనల్ కింద రూ. 8లక్షల చెక్కు ను

నల్లగొండ జిల్లా ఎస్పీ చందనా దీప్తి

ప్రజా దీవెన,నల్లగొండ క్రైమ్: నల్లగొండ(Nalgonda) జిల్లాపోలీసు కార్యాల యంలోని ఏ.ఆర్ విభాగంలో హెడ్ కానిస్టేబుల్ గా పని చేస్తూ గుండె పోటుతో మరణించిన యల్లారెడ్డి సతీమణి దివ్యకు(Divya) భద్రతా పార్ట్ ఫైనల్ కింద రూ. 8లక్షల చెక్కు ను,నార్కెట్ పల్లి పోలీసు స్టేషన్ లో హోంగార్డ్ గా పనిచేస్తూ బిఆర్ ఎస్(BRS) పార్టీ మీటింగ్ లో ట్రాపిక్ విధులు నిర్వర్తిస్తూ ప్రమాదవశాత్తు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన హో గార్డ్ యం.నవ కిషోర్ సతీమణి అనుషా(Anusha) ప్రమాద బీమా కింద రూ. 30లక్షల చెక్కును జిల్లా యస్.పి చేతుల మీదుగా అందజేసి కుటుం బ సభ్యులను పరామర్శించారు.

ఈ సందర్భంగా జిల్లా యస్.పి దీప్తి( S.P.Deepti)మాట్లాడుతూ చనిపోయిన పోలీ సుల కుటుంబాలకు పోలీస్ శాఖ అన్ని రకాలుగా అండగా నిలుస్తుం దని, ప్రభుత్వం ద్వారా వారికి రావాల్సిన అన్ని రకాల లబ్ది సాధ్యమైనంత త్వరగా ఇప్పించేలా కృషి చేస్తామని, పోలీస్ కుటుంబాల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తామని తెలిపారు.ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ రాములు నాయక్, డియస్పీ శ్రీనివాస్,హోం గార్డ్ ఆర్.ఐ వి.నరేష్ , అడ్మిన్ ఆర్. ఐ సంతోష్, విశాల్ బటియా HDFC బ్యాంక్ సర్కిల్ హెడ్,అనూప్,కుమార్, క్లస్టర్ హెడ్,మేనేజర్ శ్రవణ్ కుమార్, యన్. శ్రీను,మరియు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.

Financial security for police families