–రాష్ట్రంలోనే తొలిసారిగా నల్లగొండ జిల్లా ఇందుగులలో ఇన్స్ స్టాలేషన్
–ఎరువులు కూడా ఆటోమేషన్ ద్వారా అందించవచ్చు
— జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి అనంతరెడ్డి
ప్రజాదీవెన నల్గొండ:
Automated Irrigation System: తెలంగాణలో రాష్ట్రం లోని నల్గొండ జిల్లా మాడుగుల పల్లి మండలం ఇందుగుల గ్రామంలో మొట్టమొదటి సారిగా ఆయిల్ పామ్ తోటలో ఇరిగేషన్ ఆటోమేషన్ ను ఇన్స్ స్టాలేషన్ చేసినట్లు జిల్లా ఉద్యాన పట్టుపరిశ్రమల అధికారి అనంతరెడ్డి తెలిపారు. ఇందుగుల గ్రామానికి చెందిన రైతు మంత్రాల వెంకటరెడ్డి తనకున్న నాలుగు బోర్ల ద్వారా వచ్చే నీటిని ఉద్యానశాఖ వారు ఇచ్చిన ఫాంపాండ్ లో నీటిని స్టోర్ చేసుకొని డ్రిప్ ద్వారా తోటకు అందిస్తున్నారని పేర్కొన్నారు.
4వ సంవత్సరం ఆయిల్ పామ్ తోట ఎకరానికి సుమారు 3టన్నుల దిగుబడి పొందుతున్న తోటకి.. సాగు నీటి ఎరువులు(ఫర్టిగేషన్) తగు మోతాదులో తగిన రీతిలో బిందు సేద్యం ద్వారా ఆటోమేటెడ్ డ్రిప్ ద్వారా తమ తోటలో ఉన్నా అన్ని మొక్కలకి సిఫారసు చేసిన మోతాదులో మొక్కలకు వాల్వ్స్, మోటార్ ను మొబైల్ యాప్ ద్వారా కంట్రోల్ చేసుకొని ఎటువంటి కూలీల అవసరం లేకుండా ఎక్కడ నుండి అయినా తోటలో కావాల్సిన నీటి యాజమాన్యం చేసుకోవచ్చని తెలిపారు.
మొక్కలకు సిఫారసు చేసిన ఎరువులు కూడా ఆటోమేషన్ ద్వారా అందించవచ్చని అన్నారు. అమెరికా పర్యటనకు వెళ్తున్న రైతు వెంకట్ రెడ్డి తోటలో సిస్టంను మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ఉద్యాన పట్టు పరిశ్రమ అధికారి అనంతరెడ్డి వివరాలను వెల్లడించారు. ఒకసారి టైమింగ్ సెట్ చేస్తే ఇంట్లో కూర్చొని, లేదా పొరుగు దేశం లో వున్న, ప్రపంచం లో ఎక్కడ వున్నా 365 రోజులు అన్ని వాల్వ్ లు, మోటార్లు ఆటోమేటిక్ గా సెట్ చేసిన టైమర్ తో ఆన్ అండ్ ఆఫ్ చేసుకుంటాయని అన్నారు.
ఈ ఆటోమేటెడ్ సిస్టం ను రైతు మంత్రాల వెంకట్ రెడ్డి 12 ఎకరాల తోటలో ఇన్స్ స్టాల్ చేశారని తెలిపారు. ఈ కార్యక్రమం లో మొబిటెక్ ఉమ్మడి నల్గొండ జిల్లా ప్రతినిధి మలిగిరెడ్డి సంగీత్ రెడ్డి, నెటాఫిమ్ సాంకేతిక నిపుణులు పిన్నపురెడ్డి శ్రీనివాస్ రెడ్డి, రైతులు పాల్గొన్నారు.