Dr. Sangani Malleshwar:సామాజిక ఉద్యమకారుడు మల్లన్న కు సంపూర్ణ మద్దతు
తెలం గాణ ఉద్యమ సెంటిమెం టును ఉపయోగించుకొని, అధికా రం చేపట్టి దశాబ్దం పాటు పాలించి, రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిన బిఆ ర్ఎస్ పార్టీని రాజకీయంగా బొంద పెట్టవలసిన అవసరం ఉందనిపూలే ఆశయ సాధన సమితి (పాస్)రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అభిప్రా యపడ్డారు.
పాస్ అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్
ప్రజా దీవెన, నల్లగొండ: తెలంగాణ(Telangana) ఉద్యమ సెంటిమెంటును ఉపయోగించుకొని, అధికారం చేపట్టి దశాబ్దం పాటు పాలించి, రాష్ట్రాన్ని అప్పలపాలు చేసిన బిఆ ర్ఎస్ పార్టీని రాజకీయంగా బొంద పెట్టవలసిన అవసరం ఉందనిపూలే ఆశయ సాధన సమితి (పాస్)రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ సంగని మల్లేశ్వర్ అభిప్రా యపడ్డారు. శనివారం నల్లగొండ(Nalgonda) జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉద్యోగాల భర్తీ కొరకై నోటిఫికేషన్లు ఇచ్చి, లీకేజీలతో లక్షలాదిమంది నిరుద్యోగుల రోడ్డున పడ్డారు.
శాసనసభ ఎన్నికల్లో నిరుద్యోగుల ఆగ్రహానికి గురై, పదవిచ్యుతుడైన కేసీఆర్(KCR) ను నల్లగొండ, ఖమ్మం, వరంగల్ పట్టభద్రుల నియో జక వర్గంలో కూడా మట్టి కర్పించాలని నిరుద్యోగ యువకులకూ, ఉద్య మకారులకు విజ్ఞప్తి చేశారు. ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు కల్పిస్తానని వాగ్దానం చేసి పది సంవత్సరాలు పూర్తి అయినప్పటికీ 20 కోట్ల ఉద్యోగాలు కాదు రెండు లక్షల కూడా కల్పించలేదని, కేంద్ర ప్రభుత్వ సంస్థలలో 30 లక్షల ఉద్యోగాలు మూలుగుతున్నప్పటికీ అవి నింపకుండా ఎస్సీ, ఎస్టీ, బీసీ నిరుద్యోగ యువతకు తీవ్ర అన్యాయానికి గురిచేసిన బీజేపీ (BJP)పార్టీకి కూడా పట్టభద్రుల ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలని, ప్రజల గొంతుకగా యువత సమస్యల గురించి నిరంతరం ప్రశ్నిస్తున్న తీన్మార్ మల్లన్న నూ పెద్దల సభకు పంపడం అవసరమని డాక్టర్ సంగని మల్లేశ్వర్(Sangani Malleshwar) నిరుద్యోగులకు యువతకు పిలుపునిచ్చారు.
శాసనసభ ఎన్నికల్లో రెండు లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని హామీ ఇచ్చి, ఇప్పటికే 36 వేల ఉద్యోగాలు భర్తీ చేసి ముందడుగు వేసినారని , ఎన్నికలకు ముందు రాహుల్ గాంధీ కులగణన చేస్తామని హామీ ఇచ్చినట్టుగానే, రేవంత్ ప్రభుత్వం శాసనసభలో తీర్మానం చేసిందని, దామాషా ప్రకారం రిజర్వేషన్స్ అమలు కావాలంటే కాంగ్రెస్ పార్టీ నిలబెట్టిన అభ్యర్థి తీన్మార్ మల్లన్నకు(Tinmar Mallanna)మొదటి ప్రాధాన్యత ఓటు వేసి సీఎం రేవంత్ ఇచ్చిన హామీలన్నీ అమలు చేయించు కోవలసిన అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ముఖ్యంగా యువ తకు ఉందని గుర్తు చేశారు. ప్రజల గొంతుకగా యువత సమ స్యల గురించి నిరంతరం ప్రశ్నిస్తున్న మల్లన్న పెద్దల సభలలో ఉండడం అవసరమని పాస్ రాష్ట్ర అధ్యక్షులు మల్లేశ్వర్ అభిప్రాయప డ్డారు.ఈ సమావేశంలో నల్గొండ జిల్లా అధ్యక్షులు తంతె నపల్లి సైదులు గౌడ్, పాస్ రాష్ట్ర నాయకులు ఎస్ కె సర్దార్, డాక్టర్ గట్టి ఎల్లయ్య, డాక్టర్ వంగల సుధాకర్, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
Full support for social activist Mallanna