*బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు*..
ప్రజా దీవెన, నల్గొండ టౌన్:బిజెపి రాష్ట్ర అధ్యక్షులు కేంద్ర మంత్రివర్యులు జి.కిషన్ రెడ్డి పిలుపుమేరకు భారతీయ జనతా పార్టీ చేపట్టిన వాజ్పేయి శతాబ్ది ఉత్సవాల్లో భాగంగా బిజెపి కిసాన్ మోర్చా ఆధ్వర్యంలో నల్గొండ జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో స్వచ్ఛభారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి పాల్గొన్నారు..
*గోలి మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ*..
రాజనీతిజ్ఞుడనే పదానికి నిలువెత్తు నిదర్శనం అటల్ బిహారీ వాజ్ పేయి కొనియాడుతూ ,పార్టీలకు అతీతంగా చెరగని అభిమానం సంపాదించుకున్న గొప్ప నాయకుడు మాజీ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్ పేయి అని బిజెపి కిసాన్ మోర్చా జాతీయ నాయకులు గోలి మధుసూదన్ రెడ్డి తెలిపారు..
జాతీయ రహదారుల అభివృద్ధి, ప్రధాన మంత్రి గ్రామ సడక్ యోజన మరియు సర్వశిక్షా అభియాన్ వంటి ముఖ్యమైన సంస్కరణలు ఆయన హయాంలో జరిగాయి అని మధుసూదన్ రెడ్డి అన్నారు.పోఖ్రాన్ అణు పరీక్షలను చేపట్టి,మరియు 1999 కార్గిల్ యుద్ధంలో భారతదేశానికి విజయాన్ని అందించాడు అని అన్నారు.దేశ రాజకీయాలకు సరికొత్త అర్థం చెప్పిన నాయకుడు, నవ భారత నిర్మాణానికి బాటలు వేసిన మార్గదర్శి వాజ్పేయి అని గోలీ మధుసూదన్ రెడ్డి కొనియాడారు..