Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Group-II Examinations: ప్రశాంతంగా ముగిసిన మొదటి రోజు గ్రూప్ 2 పరీక్ష

ప్రజాదీవెన, నల్గొండ : మొదటి రోజు నల్గొండ జిల్లాలో నిర్వహించిన గ్రూప్-2 పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి తెలిపారు .ఆదివారం నల్గొండ, మిర్యాలగూడ పట్టణాలలో ఏర్పాటుచేసిన (87 )కేంద్రాలలో గ్రూప్-2 పరీక్షలు జరిగాయి. పరీక్షలు ప్రారంభమైన తర్వాత జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి నల్గొండ జిల్లా కేంద్రంలోని రామగిరి లోని మహిళ డిగ్రీ కళాశాలలో ఏర్పాటుచేసిన పరీక్ష కేంద్రాన్ని ఆకస్మిఖంగా తనిఖీ చేశారు. ఆ పరీక్ష కేంద్రానికి కేటాయించిన అభ్యర్థులు, హాజరైన ,గైర్హాజరైన అభ్యర్థుల వివరాలను చీఫ్ సూపరింటిండెంట్ ను అడిగి తెలుసుకున్నారు. అంతేకాక అక్కడ పరీక్షల నిర్వహణకు చేసిన ఏర్పాట్లు సైతం ఆమె పరిశీలించారు.

అనంతరం జిల్లా కలెక్టర్ కాకతీయ డిగ్రీ, పీజీ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాన్ని సైతం తనఖి అక్కడ వివరాలను చీఫ్ సూపరింటిండెంట్ ను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ గ్రూఓ -2 పరీక్షల సందర్బంగా జిల్లాలో ఎలాంటి సంఘటనలు జరగకుండా చూసుకోవాలని ఆదేశించారు. పరీక్షల సందర్భంగా పోలీసు, రెవెన్యూ, తదితర శాఖల అధికారులకు కేటాయించిన విధులను తూ.చా తప్పకుండా పాటించాల్సిందిగా ఆదేశాలు జారీ చేశారు .మొదటిరోజు నిర్వహించిన గ్రూప్ -2 పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయని తెలిపారు.