–మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డికి కాంగ్రెస్ నేతల హెచ్చరిక
Gummula Mohan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నిరంతరం ప్రజల కోసం పాటుపడే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని వ్యక్తిగతంగా విమర్శిస్తే చూస్తూ ఊరుకునేది లేదని నల్లగొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (Gummula Mohan Reddy), మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డిలు (Burri Srinivas Reddy) హెచ్చరించారు. ఈ మేరకు వారు నేరుగా నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి కి హెచ్చరిక చేస్తూ అవసరమై తే ఊరికిచ్చి కొట్టాల్సిన పరిస్థితి ఎదురవుతుందన్నారు.
నల్లగొండ మంత్రి క్యాంపు కార్యాలయంలో (In the camp office) ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పార్టీ కార్యా లయం ఆక్రమణ, కూల్చివేతకు సంబంధించి ప్రభుత్వ అధికారులు చూసుకుంటారని, మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్ రెడ్డి మతి స్థిమితం కోల్పోయి మంత్రి కోమటిరెడ్డి వెంక ట రెడ్డిని నోటికి వచ్చినట్లు, వ్యక్తిగ తంగా విమర్శిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.ఇష్టం వచ్చినట్టుగా నోటికి వచ్చినట్టు మాట్లాడితే మా దమ్ము ఏంటో చూపిస్తామని,గత అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు 54 ఓట్ల మె జార్టీతో మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ని గెలిపించి ప్రజలు కంచర్ల భూపాల్ రెడ్డికి తగిన బుద్ధి చెప్పారని, అయినప్పటికీ ఇంకా నోటి దురుసు మానుకోలేదని గుర్తు చేశారు. గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో నల్లగొండలో ఒక్క రోడ్డు తప్ప చేసింది ఏమీ లేదని, ప్రతి గ్రామంలో ట్రాన్స్ఫార్మర్లు, రోడ్లు, నల్గొండ నియోజకవర్గంలో వరద కాలువలు ఏర్పాటు చేసిన ఘనత మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డే అని
వివరించారు.సొంత నిధులతో కూ డా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలను చేపట్టాడని, ఇప్పటికైనా కంచర్ల భూపాల్ రెడ్డి తన భాష మార్చు కోవాలని హితవు పలికారు. కంచర్ల భూపాల్ రెడ్డి కాంగ్రెస్ లో రౌడీ రాజ కీయం చేస్తున్నారని విమర్శిస్తున్నా రని, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం లోకి వచ్చిన తర్వాత నల్లగొండ నియోజకవర్గంలో ఎక్కడా కూడా ఘర్షణలు చోటు చేసుకున్న దాఖ లాలు ఉన్నాయా అని ప్రశ్నించారు.
కంచర్ల భూపాల్ రెడ్డి (bhupal reddy)తన నోటి దు రుసుతో అందరినీ దూరం చేసుకు న్నాడని, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యక్తిగతంగా విమర్శిస్తే ఇక చూస్తూ ఊరుకోమని పునరు ద్ఘాటించారు.విలేకరుల సమావేశం లో తిప్పర్తి, నల్లగొండ , కనగల్ మాజీ జెడ్పిటిసిలు పాశం రామ్ రెడ్డి, వంగూరి లక్ష్మయ్య, నర్సింగ్ శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ జూకూరి రమేష్, డిసిసిబి డైరెక్టర్ పాశం సంపత్ రెడ్డి, పలు వురు కౌన్సిలర్లు పాల్గొన్నారు