Gummula Mohan Reddy: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్జీ కళాశాల ఆవరణలో యాదవుల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి నిర్వహించే సదర్ సమ్మేళనం కార్యక్రమం నిర్వహణ కోసం రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి (Komatireddy Venkatareddy) పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గుమ్ముల మోహన్ రెడ్డి (Gummula Mohan Reddy) ద్వారా బుధవారం నల్గొండలోని క్యాంపు కార్యాలయంలో రూ. లక్ష రూపా యల విరాళాన్ని అందజేశారు.
ఈ కార్యక్రమంలో నల్గొండ మాజీ జెడ్పిటిసి వంగూరి లక్ష్మయ్య (ZPTC Vangoori Lakshmaiah), కాంగ్రెస్ పార్టీ నాయకులు అల్లి సుభాష్ యాదవ్, గుండెబో యిన వెంకన్న యాదవ్, మద్ది శ్రీనివాస్ యాదవ్, కడారి కోటి, గోగుల గణేష్ తదితరులు పాల్గొన్నారు.