Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Gutta Sukhender Reddy: రాష్ట్ర ప్రజలకు క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు

తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి

ప్రజాదీవెన, నల్గొండ : తెలంగాణ రాష్ట్ర ప్రజలకు తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి క్రిస్మస్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.ఏసుక్రీస్తు జన్మ దినాన్ని పురస్కరించుకుని జరుపుకొనే క్రిస్మస్ పండుగ క్రైస్తవులకు పరమ పవిత్రమైనదని ఆయన అన్నారు. క్రీస్తు బోధనలు ప్రతి ఒక్కరికీ ఆదర్శప్రాయమని తెలిపారు. ప్రేమను పంచడం, మంచి మనసుతో సేవ చేయడం ఎలాగో క్రీస్తు బోధనలు తెలిపాయని ఈ సందర్భంగా పేర్కొన్నారు.

రాష్ట్ర ప్రజలు క్రిస్మస్ పండుగను ఘనంగా జరుపుకోవాలని ప్రజలందరూ సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో ఆనందంగా జీవించాలని, ప్రజలకు ఏసుక్రీస్తు చల్లని దీవెనలు ఎల్లప్పుడూ మెండుగా ఉండాలని తెలంగాణ శాసన మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ఆకాంక్షించారు.