Health Calendar : ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : డి ఎం హెచ్ ఓ కార్యాలయము నందు టీఎన్జీవోస్ మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ ఫోరం 2025 కేలండర్ జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా. పుట్ల శ్రీనివాస్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమములో జిల్లా టీఎన్జీవోస్ అధ్యక్షులు నాగిల్ల మురళీ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఉద్యోగులకు టీఎన్జీవోస్ – 2025 డైరీలు అందచేయడం జరిగింది.
ఈ కార్యక్రమములో డా. కళ్యాణ్ చక్రవర్తి, డా. కేస రవి, డా. వేణుగోపాల్ రెడ్డి, డా. కృష్ణ కుమారి, డా. గీతావాని, డా. అరుంధతి, టీఎన్జీవోస్ కార్యదర్శి జే. శేఖర్ రెడ్డి, ఏ ఓ గౌస్, విజయ్ కృష్ణ, లక్షమయ్య, వెంకట్ రెడ్డి, సైదులు నాయక్ భాస్కర్, ఫోరమ్ అధ్యక్షులు సాయి శశాంక్ రెడ్డి కార్యదర్శి వేంకటపతి మహబూబ్ అలీ ,గోవింద్ నాయక్, అనూరాధ, ముబిన్ మరియు మేడికల్ ఆండ్ హెల్త్ ఉద్యోగులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.