ప్రజా దీవెన, నల్లగొండ టౌన్:
Alumni Meet: నల్లగొండలోని మమత హైస్కూల్ పూర్వ విద్యా ర్థుల సమ్మేళనం ఆహ్లాదంగా, అపూర్వంగా జరిగింది. తమకు చదువు చెప్పిన ఉపాధ్యాయులను కార్యక్రమానికి ఆహ్వా నించి ఘనంగా సన్మానించారు. నల్గొండ పట్టణం ఆర్టీసీ కాలనీలోని మమత హై స్కూల్ 1991- 92 బ్యాచ్ 10వ తరగతి విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం నల్గొండ పట్టణంలోని ఇండియన్ మె డికల్ అసోసియేషన్ భవన్ లో ఘనంగా జరిగింది. నాటి విద్యార్థులంతా నేడు ఒకచోట చేరి నాటి తీపి జ్ఞాపకాలను నెమరు వేసుకున్నారు. ఒకరినొకరు ఆత్మీయంగా పలకరించుకుంటూ పరస్పరం యోగక్షేమా లను అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా మమత హైస్కూల్ కరస్పాండెంట్ యానాల ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్య నిర్లక్ష్యానికి గురి కావడంతోనే అప్పట్లో తాము మమత హై స్కూల్ ను ప్రారంభించామని తెలిపారు. అనుభవం లేనప్పటికీ పాఠశాలలను నడిపిస్తూ విద్యావ్యవస్థలో ఎన్నో మార్పులు తీసుకువచ్చామని, ఒడిదుడుకులు ఎదురైనప్పటికీ ఇప్పటికీ పాఠశాలను నడిపిస్తున్నామని చెప్పారు.
ఎన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ నాటి నుండి నేటి వరకు పాఠశాలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. పండుగలు, సెల వు రోజులు అనే తేడా లేకుండా తరగతులు నిర్వహిస్తే కష్టమైన ప్పటికీ విద్యార్థులు ఎంతో ఇష్టపడి చదివి నేడు ప్రయోజకులై తమను ఈ కార్యక్రమానికి ఆహ్వానించడం ఎంతో సంతోషం కలిగించింద న్నారు.
తమకు అనుభవం లేనప్పటికీ పాఠశాల స్థాపిస్తే సహకరించిన అప్పటి విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు తెలిపారు. పలువురు పూర్వ విద్యార్థులు మాట్లాడుతూ 33 ఏళ్ల క్రితం చదువుకున్న తాము అనంతర కాలంలో ఒక్కొక్కరు ఒ క్కోచోటికి వెళ్లిపోయారని, వారంద రినీ ఒకచోటకి తీసుకురావడానికి ప్ర త్యేకంగా వాట్సాప్ గ్రూప్ ఏర్పాటు చేసి ఎన్నో ప్రయత్నాల తర్వాత అందరిని ఒక చోటికి చేర్చామని తెలిపారు. 33 ఏళ్ల తర్వాత తా మంతా ఒకచోట చేరి నాటి తీపి జ్ఞా పకాలను నెమరు వేసుకోవడం ఎం తో సంతోషం కలిగించిందన్నారు.
పూర్వ విద్యార్థుల సమ్మేళనాలతో స్నేహ సంబంధాలు మెరుగుపడటంతో పాటు పరస్పరం సమస్యలు ప రిష్కరించుకోవడానికి అవకాశం కలుగుతుందన్నారు. చదువు చె ప్పిన గురువులు కూడా తండ్రులతో సమానమేనని, అందుకే ఫాదర్స్ డే రోజు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకున్నామని తెలిపారు. ఉపా ధ్యాయుల సూచన మేరకు మరోసా రి ఏర్పాటు చేసే పూర్వ విద్యార్థుల సమ్మేళనాన్ని ప్లాస్టిక్ రహితంగా ఏ ర్పాటు చేస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో పూర్వ విద్యార్థులు రెడ్డిపల్లి గిరి,నామిరెడ్డి శ్రీనివాస్ రెడ్డి, శ్రీపతి యాదయ్య, మహమ్మద్ కవి, ఓర్సు వెంకటేశ్వర్లు, వరంగల్ కృష్ణ,సుభాష్ రెడ్డి, రబ్బాని, రాజేం దర్ రెడ్డి, అంశాల సత్యనారాయ ణ, రజని, జ్యోతి, నిర్మల, కవిత, పెద్ది శ్రీనివాస్, మమత హై స్కూల్ ఉపాధ్యాయులు ఎండి సలీం, ప్రతా పరెడ్డి, వెంకటరామిరెడ్డి, దాడి చం ద్రశేఖర్ రెడ్డి, శేఖర్ రెడ్డి, యానాల రాధిక, దొడ్డి రామ్మూర్తి, దాడి సు ధాకర్ రెడ్డి, ఊట్కూరు మధుసూ దన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.