నల్గొండ జిల్లా హోంగార్డ్ సిబ్బంది
ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖలో పనిచేస్తున్న హోంగార్డు సిబ్బందికి డిసెంబర్ 6 న హోంగార్డు ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హోంగార్డు సేవలను గుర్తించి రోజువారి జీతం మరియు ఇతర అలవెన్స్లు పెంపుపై నల్లగొండ జిల్లా హోంగార్డ్ సిబ్బంది కృతజ్ఞతలు తెలుపుతూ వర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చిత్రపటానికి పాలాభిషేకం చేయడం జరిగింది. ఈ సందర్భంగా హోంగార్డు సిబ్బంది మాట్లాడుతూ పోలీస్ శాఖలో ఒక భాగమై పోలీసులతో సమానంగా విధినిర్వాహణలో శాంతిభద్రతల పరిరక్షణకు, ప్రజల రక్షణ కొరకు క్రమశిక్షణగా తమకు అప్పగించిన విధులు నిర్వర్తిస్తూ బాధ్యతాయుతమైన సేవలను అందిస్తూ దేశంలోనే తెలంగాణ రాష్ట్ర పోలీస్ శాఖకు మంచి పేరు ప్రతిష్టలు తెస్తామని అన్నారు.
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మా యొక్క సేవలను గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హోంగార్డ్ సంక్షేమం కొరకు సిబ్బందికి ప్రకటించిన వివరాలు..హోమ్ గార్డుల దినభత్యం ఇప్పుడున్న Rs 921/- నుండి Rs 1000/- కు పెంపు.హోమ్ గార్డ్స్ వీక్లీ పరడే అలవెన్స్ను నెలకు Rs 100/- నుండి Rs 200/- కు పెంపు.
హోమ్ గార్డ్స్ లో పనిచేస్తూ దురదృష్టవశాత్తు సహజమరణం పొందినా, ఆక్సిడెంటల్ మరణం చెందినా Rs 5 లక్షల ఎక్సగ్రేసియా.ఈ కార్యక్రమంలో హోంగార్డ్ ఆర్.ఐ శ్రీను, హోం గార్డు సిబ్బంది సలీం, సైదులు, విజయ్, యాదగిరి, కరుణాకర్,హరి ఇతర సిబ్బంది పాల్గొన్నారు.