ప్రజాదీవెన, నల్గొండ టౌన్ : నాగార్జున ప్రభుత్వ కళాశాల, తెలుగు శాఖ మరియు ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం, నెల్లూరు, (భారతీయ భాషా సంస్థ, మైసూరు) వారి సంయుక్త ఆధ్వర్యంలో డిసెంబర్, 11, భారతీయ భాషా దినోత్సవo సందర్భంగా కళాశాలలో “తెలుగు భాషా వైశిష్ట్యం – మాతృభాష ప్రయోజనాలు” అంశంపై ఉపన్యాస పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సుమరు 35 మంది విద్యార్థులు పోటీలో పాల్గొన్నారు.
ఈ కార్యక్రమానికి 150 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఈ పోటీలో పి జి తెలుగు విద్యార్థినులు కావేరి, నాగమణి ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులను గెలుచుకోగా తృతీయ బహుమతిని డిగ్రీ విద్యార్థిని గౌతమి గెల్చుకుంది. వీరిని కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డా. అంతటి శ్రీనివాస్, అకాడమీక్ కోఆర్డినేటర్ డా. పరంగి రవికుమార్, తెలుగు శాఖాధ్యక్షులు డా. డా. వెల్దండి శ్రీధర్ , తెలుగు అధ్యాపకులు, విషయ నిపుణులు డా. టి. సైదులు, డా. వాస భూపాల్, గోవర్ధనగిరి, ప్రభాకర్, లింగస్వామి, జానయ్య, శ్రవణ్ కుమార్ పాల్గొన్నారు.