Welcome To Praja Deveena News Portal, Which Provides Latest News In Telugu, Breaking News Alert at prajadeveena.com

Jagadish Reddy: ఉమ్మడి నల్లగొండలో పడకేసిన పరిపాలన

–మిర్యాలగూడ మీడియా సమావే శంలో మాజీ మంత్రి జగదీష్ రెడ్డి

Jagadish Reddy: ప్రజా దీవెన, మిర్యాలగూడ: ఉమ్మడి నల్లగొండ జిల్లాతో పాటు రాష్ట్రంలో గత తొమ్మిది నెలలుగా పరిపాలన పడకేసిందని మాజీమం త్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి (Jagadish Reddy)ధ్వజమెత్తారు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రాన్ని తిరోగమనం లో నడుపుతోoదని విమర్శిం చారు.రాష్ట్ర ప్రభుత్వంలో ముఖ్య మంత్రితో సహా మంత్రులు కొత్తయి చేసింది ఏమీ లేకపోగా ఉన్న వ్య వస్థలను కూడా సరిగా నడపలేక పోతున్నారని ఎద్దేవా చేశారు. మంగళవారం మిర్యాలగూడ లో ఏర్పాటు చేసిన మీడియా సమా వేశంలో ఆయన మాట్లాడారు.

విద్య,వైద్యం తోపాటు ప్రాజెక్టులకు (to projects)నీళ్లు ఇవ్వలేకపోతున్నారని ఉన్న వ్యవస్థలను నాశనం చేసి తెలం గాణ రాష్ట్రం అంటేనే భయపడేలా చేస్తున్నారని దుయ్యబట్టారు. ఉన్న వి కూలగొట్టడం తప్ప కొత్తవి నిర్మిం చే ఆలోచన, తెలివి ఈ ప్రభుత్వా నికి లేదని అన్నారు. నల్గొండ జిల్లా లో ఉన్న ఇద్దరు మంత్రులు కూడా ఇద్దరికి ఇద్దరు దద్దమ్మ లాగా ఉ న్నారని తీవ్ర స్థాయిలో మండి పడ్డారు. కృష్ణ గోదావరి నీళ్ల విష యంలో ఇద్దరు మంత్రులకు అవ గాహన లేదని స్పష్టం చేశారు.

మంత్రుల నిర్లక్ష్యంతో నీళ్లన్నీ (water) సము ద్రం పాలవుతున్నాయని, మన పం టలు ఎండిపోతున్నాయని ఆందో ళన వ్యక్తం చేశారు. గత 60 ఏళ్లలో కాంగ్రెస్ పాలనలో ఉన్న పరిస్థితు లే ఈ తొమ్మిది నెలలో పునరావత మవుతున్నాయని విచారం వ్యక్తం చేశారు.ఖమ్మం జిల్లా మంత్రుల అ త్యాశతోటి నాగార్జునసాగర్ కెనాల్ (Nagarjunasagar Canal)కు రెండు చోట్ల గండి పడడం వాస్త వం కాదా అని ప్రశ్నించారు. మేము ఖమ్మం కు నీళ్లు తీసుకుపోవద్దు అనడం లేదని, నేను మంత్రిగా ఉన్నప్పుడు ఖమ్మం తో పాటు మన జిల్లాకు కూడా ప్రణాళిక అబద్ధంగా నీళ్లు అందించానని గుర్తు చేశారు. మా హయాంలో సాగర్ కాలువకు గండి పడితే ఏడు రోజుల్లో పూర్తి చేశామని, కానీ ఇప్పుడు 20 రోజులైనా దిక్కు లేదని విమర్శించారు. జిల్లా మంత్రులకు అక్రమ సంపాదన, బ్లాక్ బ్లాక్మెయిలింగ్ తప్ప పరి పాలన మీద సోయలేదని, మీరు తెచ్చిన జీవో 33 వలన సూర్యాపే ట, నల్గొండ జిల్లాలకు ఎక్కువ న ష్టం వాటిల్లిందని ఆరోపించారు.

సుప్రీంకోర్టు లెంపకాయి వేసి అంద రికి అవకాశం కల్పించాలని చెప్పి నా కూడా నాలుగు రోజులైనా కౌన్సిలింగ్ ప్రారంభించలేదని విమర్శించారు. ఈ ప్రభుత్వం మెడి కల్ కళాశాలలో (Medical College)చేరే విద్యార్థులకు అవకాశం కల్పిస్తారా లేదా అని చెప్పడం లేదని, దీంతో విద్యార్థులు ఆందోళనకు గురవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గత పదేళ్ల పాలనలో 1000 కి పైగా గురుకు లాలు,30కి పైగా మెడికల్ కాలేజీ లు కెసిఆర్ (kcr)నాయకత్వంలో ఏరకం గా ప్రారంభించబడ్డాయో ప్రజలు చూశారని, రాష్ట్రంలో అప్పుడే పో లీసు రాజ్యం మొదలుపెట్టి అరాచకాలు చేస్తున్నారని ఆరోపిం చారు. వాళ్ల తప్పులపై ప్రశ్నించిన సోషల్ మీడియాలో పోస్ట్లు పెట్టిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తు న్నారని అన్నారు. చివరికి మీడి యా మీద కూడా కేసులు పెట్టి బెది రిస్తున్నారని, స్థానికంగా అధికార పార్టీ నాయకుల వలన పొరపాటు జరిగిందని వార్తలు రాస్తే వాళ్ళ యాజమాన్యాలతో మాట్లాడి రి పోర్టర్ ల ఉద్యోగాలు ఊడ గొడు తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.

జిల్లా ఎస్పీతో పాటు ఇతర పోలీసు అధికారులకు (Police officers)చెప్తున్నా మీరు ని బంధనలను అతిక్రమించి చిన్న త ప్పు చేసినా శిక్షకు అర్హులు అని, చట్ట ప్రకారమే పనిచేయండి మం త్రులు, ఎమ్మెల్యేలు హుకుం జారీ చేస్తే తప్పుడు కేసులు పెడతామం టే ఊరుకోబోమని హెచ్చరించారు. వారి మాటలు అడ్డగోలుగా పట్టిం చుకుంటే మీరు చిక్కున పడతార ని, పక్క రాష్ట్రంలో ఏం జరుగుతు న్నాయో అందరం చూస్తున్నామని గుర్తు చేశారు. జిల్లా మంత్రి కోమ టిరెడ్డి వెంకట్ రెడ్డి ఏమి పనిచేస్తుం డంటే అది కేసులు పెట్టించడం తప్ప వేరే పని ఏమీ లేదు ఎద్దేవా చేశారు. విలేకరులను భయపెట్టిం చి, రాజ్యం చేయడం ఎవరి వల్ల కాలేదని, చరిత్రలో ఎవరు నిలపడ లేదని, ఇంకా నాలుగేళ్లు ఉంది ముందుంది ముసళ్ళ పండుగ అప్పుడే ఏం మొదలైందని పోలీ సులు అడ్డం పెట్టుకుంటున్నారని వివరించారు. ఈ జిల్లాలో మీరు వదిలిపెట్టి పోయిన కరువును, ఫ్లోరైసిస్ వ్యాధిని మేము రూపు మాపామని తెలిపారు. రాష్ట్రంలో అందరికీ రుణమాఫీ అమలు చే యాలని డిమాండ్ చేశారు.వెంటనే రాష్ట్రంలో రైతు భరోసాని అమలు చేయాలని కోరారు.ఈ మీడియా సమావేశంలో ఎమ్మెల్సీ కోటిరెడ్డి మాజీ ఎమ్మెల్యే భాస్కరరావు పాల్గొన్నారు