Jagjeevan Ram: ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: భారత మాజీ ఉపప్రధాని, దళిత బహు జ నుల,అణగారిన వర్గాల సంక్షేమం కోసం కృషిచేసిన సంఘ సంస్కర్త దేశ మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబూ జగ్జీవన్ రామ్ (Jagjeevan Ram)అని ప్రజాసంఘాల జాక్ చైర్మన్ పెరిక కరణ్ జయరాజ్ పేర్కొన్నారు. డాక్టర్ బాబూ జగ్జీవన్ రాo వర్ధంతి వేడుకలను (Funeral celebrations) నల్లగొండ జిల్లా కేంద్రంలో ఘనంగా నిర్వహిం చారు. నల్గొండ జిల్లా అధ్యక్షులు (Presidents of Nalgonda District) వడ్డెబోయిన సైదులుతో కలిసి మాట్లాడారు. దేశంలోని పీడిత ప్రజల హక్కులకోసం కొట్లాడిన మహోన్నత వ్యక్తి బాబూ జగ్జీవన్ రామ్ (Jagjeevan Ram) అని వారి సేవలను కొనియా డారు. వారి ఆశయసాధన కోసం కార్మికుల సంక్షేమం కోసం జిల్లా అభి వృద్ధి ప్రధాత రాష్ట్ర రోడ్డు భవనా లు, సినిమాటోగ్రఫీ శాఖామాత్యులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి (Komati Reddy Venkat Reddy) ఆధ్వర్యం లో కార్మికుల కోసం కృషి చేస్తామనీ తెలిపారు. ఈ కార్యక్రమములో నాయకులు ఐఎన్ టియుసి జిల్లా ప్రధాన కార్యదర్శి సుంకిశాల వెంకన్న ,ఇస్తారి, ఏంఈఎఫ్ జిల్లా అధ్యక్షులు సైదులు ,సింగం శ్రీకాంత్ ,పున్న సత్యం ,కందుల మోహన్ తదితరులు పాల్గొన్నారు .
Sign in
Sign in
Recover your password.
A password will be e-mailed to you.