–బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు అయితగోని జనార్దన్ గౌడ్
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: చదు వుల తల్లి శ్రీమతి సావిత్రిబాయి పూలే 194 వ జయంతిని పుర క్షరించుకొని బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో నల్లగొండ జిల్లా కా ర్యాలయంలో ఘనంగా నిర్వహిం చడం జరిగింది. ఈ కార్యక్రమంలో బిసి విద్యార్థి సంఘం జిల్లా అధ్య క్షుడు అయితగోని జనార్దన్ గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చదువుల తల్లి సావిత్రి బాయి పూలే జయంతి రోజున ఉపాధ్యాయురాలు దినోత్సవంగా ప్రకటించినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామ న్నారు. సావిత్రిబాయి ఫూలే, (1831 జనవరి 3– 1897 మార్చి 10) భారతీయ సంఘ సంస్కర్త, ఉపాధ్యాయిని, రచయిత్రి.
ఆమె నిమ్న వర్గాల అభ్యున్నతికి కృషి చేసిన జ్యోతీరావ్ ఫూలే భార్య. కులమత భేదాలకు అతీతంగా సమాజాన్ని ప్రేమించిన ప్రేమస్వ రూపిణి. ఆధునిక విద్య ద్వారానే స్త్రీ విముక్తి సాధ్యపడుతుందని నమ్మిన ఆమె, తన భర్తతో కలసి 1848 జనవరి 1న పూణేలో మొట్ట మొదటగా బాలికల పాఠశాలను ప్రారంభించింది. కుల వ్యవస్థకు, పితృస్వామ్యానికి వ్యతిరేకంగా, శూద్రుల, అస్పృశ్యుల, మహిళల సకల హక్కుల కోసం పోరాటం చేయటం తమ సామాజిక బాధ్య తగా ఆ దంపతులు విశ్వసించారు. నూతన వ్యవస్థ కోసం, ప్రాణాల్ని సైతం పణంగా పెట్టి సమష్టిగా పో రాటం చేసింది.
సమాజంలోని కుల తత్వం, పురుషాధిక్య ధోరణులు కలిగిన చాలామంది పండిత మేధా వులందరికీ కూడా ఆమె కేవలం జ్యోతిరావు ఫూలే భార్యగా మాత్ర మే తెలుసు. కానీ ఆమె ఆధునిక భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలు. పీడిత ప్రజలు ముఖ్యంగా స్త్రీల విద్యాభివృద్ధికి కృషి చేసిన తొలి తరం మహిళా ఉద్యమకారిణి, అదేవిధంగా నల్గొండ జిల్లా కేం ద్రంలో సావిత్రి విగ్రహాన్ని ప్రతిష్టిం చాలని వారి యొక్క జయంతి, వర్ధంతి కార్యక్రమాలు ప్రభుత్వమే ఘనంగా నిర్వహించాలని ప్రభు త్వాన్ని డిమాండ్ చేస్తున్నామ న్నారు.
ఈ కార్యక్రమంలో బీసీ రాజ్యాధికార సమితి జిల్లా అధ్య క్షుడు కర్నాటి యాదగిరి , వర్కింగ్ ప్రెసిడెంట్ మార్గం సతీష్ జిల్లా ఉపాధ్యక్షులు గడగోజ్ విజయ చారి ,పట్టణ అధ్యక్షులు చెన్నోజు రాజు, దీకొండ నవీన్ ,కర్నాటి జితేందర్ ,విద్యార్థి సంఘం జిల్లా నాయకులు కొంపల్లి రామన్న గౌడ్ విద్యార్థి సంఘం జిల్లా ఉపాధ్య క్షుడు నిమ్మగోటి శివ అక్షిత, మమ త, లక్ష్మి ,సరస్వతి , సంధ్య , స్వాతి ,యశోద, సౌజన్య , సౌమ్య ,గౌతమి, శ్రీదేవి, మనోహర్ ప్రసాద్,పందుల అనిల్ గౌడ్,రాజు , సతీష్ , నారగోని రాజు తదితరులు పాల్గొన్నారు.