–సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జులకంటి రంగారెడ్డి
Julakanti Ranga Reddy: ప్రజా దీవెన నల్లగొండ : ప్రజలు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్నా డిండి ఎత్తి పోతల పథకం డి పి ఆర్ ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించడాన్ని స్వాగటతిస్తున్నామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు జూలకంటి రంగారెడ్డి తెలిపారు.సోమవారం సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సమా వేశం డబ్బికార్ మల్లేష్ అధ్యక్షతన దొడ్డికొమురయ్య భావనంలో జరి గింది. ఈ సందర్బంగా ముఖ్యఅ తిధిగా హాజరైన రంగారెడ్డి మా ట్లాడుతూ డిండి ఎత్తి పోతల పథ కం పూర్తి ఐతే జిల్లాలో మునుగోడు దేవరకొండ నియోజకవర్గాలు భూములు సష్య శ్యామలమవు తాయని అన్నారు. యుద్ధప్రాదిపది కన పూర్తి చేసి ప్రాజెక్ట్ పనులు పూర్తి చేయాలన్నారు. మరియు జిల్లాలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు వెంటనే పంపిణి చేయాలనీ డిమాండ్ చేశారు.
ఇండ్ల నిర్మాణంలో మిగిలిన మంచినీళ్లు సౌకర్యం మూరుగు కాలువలు శానిటేషన్ కరెంట్ ఇతర పనులకు నిధులు కేటాయించి యుద్ధ ప్రాటీపదికన పూర్తి చేసి అర్హులైన లబ్ది దారులుకు పంపిణి చేయాలన్నారు.ఇండ్లు స్థలాలు లేని నిరుపేదలకు ప్రభుత్వమే భూమి కొని స్థలాలు పంపిణి చేయాలన్నారు. ఎన్నకలలో ప్రజల కిచ్చిన వాగ్దానలైన మహిళ్లలకు 2500/- వ్యవసాయ కార్మికులకు 12000/-రూపాయలు ఇవ్వాలన్నారు.అర్హులైన ప్రతి కుటుంబానికి రేషన్ కార్డులు పంపిణి చేయాలిన్నారు. ఋణ మాఫీ కానీ రైతులు ఎన్ని రోజలు ఆగాలి అని ప్రశ్నించారు.ధరణి బుమతా గా మార్చిన సంవత్సరం దాటినా విడి విధాన్నాలు రాలేదని అన్నారు. జిల్లాలో పెండింగ్ లో వున్నా రోడ్లు, కాలువలు,పూర్తి చేయాలిన్నారు.
పార్టీ ఆధ్వర్యంలో ప్రజా సమస్యల పరిష్కారానికి ఉద్యమం చేయన్నున్నట్లు తెలిపారు. ఈసమావేశంలో మాట్లా డుతున్న సిపిఎం రాష్ట్ర కార్యద ర్శివర్గ సభ్యులు జులకంటి రంగారె డ్డి, జిల్లా కార్యదర్శి తుమ్మల విరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు ముదిరెడ్డి సుధాకర్ రెడ్డి, నారి ఐలయ్య, డబ్బికార్ మల్లేష్, బండ శ్రీశైలం, పాలడుగు నాగార్జున,సయ్యద్ హశం, కందల ప్రమీల, పాలడుగు ప్రభావతి, చిన్నపక లక్ష్మి నారాయణ, వీరేపల్లి వెనకటేశ్వర్లు.తదితరులు పాల్గొన్నారు.