–మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి
ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: తెలంగాణలో రాబోయే అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలలో ఆశా వర్కర్లకు రాష్ట్ర ప్రభుత్వం రూ 18,000/ లు ఫిక్సిడ్ వేతనం నిర్ణయించాలని పీఫ్, ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పించాలని లేదంటే ఆశాలు సమ్మెకు సిద్ధమవుతారని మాజీ ఎమ్మెల్యే జూలకంటి రంగారెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. బుధవారం ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారం కోసం రాష్ట్రవ్యాప్తంగా డిసెంబర్ 15 నుండి 31తేది వరకు నిర్వహించే రాష్ట్ర బస్సు జాత నల్లగొండకు చేరుకుంది. ఈ సందర్భంగా జాతకు బతుకమ్మలు బోనాలతో ఆశా వర్కర్లు, సిఐటియు నాయకులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం ఎస్.బి.ఆర్ ఫంక్షన్ హాల్ లో డి మహేశ్వరి అధ్యక్షతన సభ జరిగింది .
ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఎన్నికల ముందు రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం బిఆర్ఎస్ ప్రభుత్వం ఆశాల సమస్యల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని, ఆశాల వేతనాలు పెంచడంతోపాటు ఉద్యోగ భద్రత కల్పిస్తామని కనీస వేతనం 18వేల రూపాయలు పెంచుతామని కాంగ్రెస్ తన ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టి ఆశాల ఓట్లతో అధికారంలోకి వచ్చిన తర్వాత ఆశల సమస్యలు పరిష్కరించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందనిఆశాల సమస్యలు పరిష్కరించాలని సిఐటియు నాయకత్వం లో ఆరోగ్యశాఖ మంత్రి, రాష్ట్ర ఉన్నాతాఅధికారులకు ,ఎమ్మెల్యేలకు, మంత్రులకు, అనేకసార్లు వినతి పత్రాలు ఇచ్చిన సమస్యలు పరిష్కరించలేదని అన్నారు.
బస్సు జాత రథసారథి యూనియన్ రాష్ట్ర అధ్యక్షురాలు పి జయలక్ష్మి, సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు తుమ్మల వీరారెడ్డి లు మాట్లాడుతూ ఎన్ హెచ్ ఎం స్కీం లో భాగంగా గత 19 సంవత్సరాల నుండి రాష్ట్రంలో ఆశ వర్కర్లు పనిచేస్తున్నారు, వీరంతా బడుగు బలహీన వర్గాలకు చెందిన మహిళలు, రాత్రనకా పగలనకా ఉదయం నుండి రాత్రి వరకు నిరంతరం ప్రజల ఆరోగ్య సేవలు అందిస్తూ డెలివరీల సందర్భంగా రెండు మూడు రోజులు కుటుంబాన్ని వదిలి హాస్పిటల్ వద్ద కలిసి వస్తుందని ,రాష్ట్ర ప్రభుత్వ ఆశాలను ఎట్టి చేయించు కుంటుందని, పెరిగిన ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలని, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 45వ ఇండియన్ లేబర్ కాన్ఫరెన్స్ సిఫారసులు మాత్రం అమలు చేయలేదని దీనివల్ల తెలంగాణలతోపాటు దేశవ్యాప్తంగా 10 లక్షల మంది ఆశలు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
కరోనాకాలంలో ఆశల శ్రమను గుర్తించిన వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఆశా వర్కర్లు గ్లోబల్ లీడర్స్ అని ఆశాలకు అవార్డును ప్రకటించింది. కానీ మన కేంద్ర ప్రభుత్వం నేటికీ ఆశల శ్రమను గుర్తించడానికి సిద్ధపడట్లేదు పైగా ఎన్ హెచ్ ఎం స్కీంకు బడ్జెట్ ను తగ్గిస్తుంది, కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లను తెచ్చి సంగం పెట్టుకునే హక్కు సమ్మె చేసే హక్కు లేకుండా చేసి కార్మిక హక్కులను కాలరాస్తుందని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తు న్నాయని వీటికి వ్యతిరేకంగా నిర్వ హించే ఆశ వర్కర్ల బస్సు జాత డిసెంబర్ 31న హైదరాబాద్ ఇందిరాపార్కు దగ్గర జరిగే ముగింపు బహిరంగ సభ ను ను జయప్రదం చేయాలని కోరారు.అనంతరం ఎస్ బి ఆర్ ఫంక్షన్ హాల్ నుండి సుభాష్ విగ్ర హం, మైసయ్య విగ్రహం మీదుగా పెద గడియారం వరకు ఆశ వర్కర్ల భారీ ప్రదర్శన నిర్వహించడం జరిగింది.
ఆశ వర్కర్ల బస్సు జాతాలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ నీలాదేవి, రాష్ట్ర కోశాధికారి గంగమని, రాష్ట్ర ఉపాధ్యక్షులు ఆర్ సాధన, రాష్ట్ర సహాయ కార్యదర్శి కే సునిత ఎన్ పద్మ ఏం బాలమణి ల బృందం పాల్గొని మా ట్లాడారు. ఈ కార్యక్రమంలో సిఐటి యు జిల్లా అధ్యక్షులు చిన్నపాక లక్ష్మీనారాయణ, ఆశ యూనియన్ జిల్లా కార్యదర్శి టి వెంకటమ్మ, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శులు దండంపల్లి సత్తయ్య, ఏర్పుల యాదయ్య, ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు తుమ్మల పద్మ, ప్రజానాట్యమండలి జిల్లా అధ్యక్ష కార్యదర్శులు నాంపల్లి చంద్రమౌళి, కుమ్మరి శంకర్, సీఐటీయూ జిల్లా కమిటీ సభ్యులు పెంజర్ల సైదులు, దయానంద్, అద్దంకి నరసింహు, బిమగాని గణేష్, పోలే సత్యనారాయణ, వరికుప్పల ముత్యాలు, అవుట రవీందర్ తదితరులు పాల్గొన్నారు.