Kancharakuntla Venkata Reddy:ప్రజా దీవెన, నల్లగొండ టౌన్: నల్లగొండ పట్టణంలోని 11వ వార్డు కతాలగూడ ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులకు వార్డు నివాసి కంచ రకుంట్ల వెంకటరెడ్డి (Kancharakuntla Venkata Reddy) బూట్లు పంపిణీ చేయడం అభినందనీయం అని మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, జిల్లా విద్యాశాఖ అధికారి బొల్లారం బిక్షపతి (Chairman Burri Srinivas Reddy, District Education Officer Bollaram Bikshapati) అన్నారు. బుధ వారం కతాల్ గూడ ప్రాథమిక పాఠశాలలో బూట్ల పంపిణీ కార్యక్రమానికి వారు ముఖ్యఅ తిథిగా హాజరయ్యాయి మాట్లా డుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థు లు కూడా ప్రైవేటు పాఠశాలల కు దీటుగా విద్యాబోధన తో పాటు యూనిఫామ్ దాతల సహకారంతో బెల్టు, టై ,బూట్లు ఇప్పించి పాఠ శాలను ఆదర్శంగా నిలపడం అభి నందనీయమని అన్నారు.
వార్డు పరిధిలోని పెద్దలు తమ వంతు సహకారంగా పాఠశాల అభివృద్ధికి పాటుపడాలని కోరారు బూట్లు పం పిణీ దాత కంచరకుంట్ల వెంకటరెడ్డి రాణి దంపతులను అభినందించా రు.ఈ కార్యక్రమంలో అమ్మ ఆదర్శ పాఠశాల (Amma Adarsh School) కమిటీ చైర్మన్ దండెంపల్లి సరోజ, పాఠశాల ప్రధానోపాధ్యా యురాలు విజయలక్ష్మి,వార్డు పెద్దలు మాజీ సర్పంచ్ గుజ్జుల జనార్దన్ రెడ్డి, కంకణాల నాగి రెడ్డి ,దండెంపల్లి సత్తయ్య, కంచర కుంట్ల వెంకట్ రెడ్డి, పజ్జురి పరమేష్, పజ్జురి సైదులు, దండెంపల్లి పరుశరామ్ బొడిగ జానయ్య, దాసరి ప్రశాంత్, దాసరి విజయ్, ఉపాధ్యాయులు చాంద్ బీ, ఆరోగ్యమ్మ , రాణి ,సునీ త తదితరులు పాల్గొన్నారు